iDreamPost

Shakuntalam : సమంత పాన్-ఇండియా మూవీ “శాకుంతలం” వచ్చేస్తోంది!

Shakuntalam : సమంత పాన్-ఇండియా మూవీ “శాకుంతలం” వచ్చేస్తోంది!

పుష్ప సినిమాలో “ఉ అంటావా..ఊఊ అంటావా” పాటతో దుమ్మురేపిన బ్యూటిఫుల్ & టాలెంటెడ్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న పౌరాణిక ఇతిహాసం ‘శాకుంతలం’. ఈ చిత్రం నిర్మాణానంతర దశలోకి ప్రవేశించింది. దీనికి సంబంధించి మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు.

“#శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది ” అని గుణ టీమ్ వర్క్స్ తమ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మేకర్స్ కూడా #MythologyforMillenials అనే హ్యాష్‌ట్యాగ్‌తో ముందుకు వచ్చారు, ఇది ‘శాకుంతలం’ చిత్రం యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది.

శాకుంతలంకి సంబంధించిన రాబోయే ఈవెంట్‌లను వారు చాలా భారీగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రొడ్యూసర్ నీలిమ గుణ మాట్లాడుతూ, ”మేము ‘శాకుంతలం’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో నిమగ్నమయ్యాము.. మా చిత్ర బృందంతో 2022ని ప్రారంభిస్తాము మరియు #శాకుంతలం సినిమా గురించి మరిన్ని అప్‌డేట్‌లను మీకు అతి త్వరలో అందించడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాము, .” అని వెల్లడించారు.

సినిమా టేకింగ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్-ఇండియా పౌరాణిక చిత్రంలో సమంత ప్రధాన పాత్రను పోషిస్తుండగా, అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ “ప్రిన్స్ భరత” పాత్ర పోషిస్తుంది. నీలిమ గుణ నిర్మించిన ఈ పౌరాణిక చిత్రం అధునాతన VFX సాంకేతికతను ఉపయోగించబోతున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసేందుకు మేకర్స్ ఆసక్తిగా ఉన్నారు.

ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంత్ పాత్రలో నటిస్తుండగా, ప్రముఖ నటుడు మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘శాకుంతలం’ సమంతకు మొదటి పౌరాణిక చిత్రం. ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఇంట్రడ్యూస్ అవ్వటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ మొత్తం పూర్తి అయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం అతి త్వరలో థియేటర్లలో సందడి చేయబోతుంది.

Also Read : Spirit : ప్రభాస్ కెరీర్ లో మొట్టమొదటి సారి.. మాములుగా ఉండదు మరి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి