iDreamPost

ముంబై నుంచి గుజరాత్‌ టైటాన్స్‌కు రోహిత్‌ శర్మ? ఇందులో నిజమెంతా?

  • Published Nov 25, 2023 | 4:21 PMUpdated Nov 25, 2023 | 4:21 PM

రోహిత్‌ శర్మ.. ఐపీఎల్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌. ముంబై ఇండియన్స్‌ జట్టుకు ఏకంగా ఐదు సార్లు కప్పు అందించాడు. అయితే.. ఐపీఎల్‌ 2024లో ముంబైని వీడి.. గుజరాత్‌ టైటాన్స్‌కు వెళ్తాడనే ప్రచారం జరుగుతోంది. అందులో నిజమెంతో ఇప్పుడుచూద్దాం..

రోహిత్‌ శర్మ.. ఐపీఎల్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌. ముంబై ఇండియన్స్‌ జట్టుకు ఏకంగా ఐదు సార్లు కప్పు అందించాడు. అయితే.. ఐపీఎల్‌ 2024లో ముంబైని వీడి.. గుజరాత్‌ టైటాన్స్‌కు వెళ్తాడనే ప్రచారం జరుగుతోంది. అందులో నిజమెంతో ఇప్పుడుచూద్దాం..

  • Published Nov 25, 2023 | 4:21 PMUpdated Nov 25, 2023 | 4:21 PM
ముంబై నుంచి గుజరాత్‌ టైటాన్స్‌కు రోహిత్‌ శర్మ? ఇందులో నిజమెంతా?

ఐపీఎల్‌ 2024కు ఇంకా చాలా సమయం ఉన్నా.. ప్రస్తుతం ఐపీఎల్‌ జట్ల గురించి క్రికెట్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకు ప్రధాన కారణం.. గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా.. ఇంటర్నల్‌ ట్రెడింగ్‌లో తిరిగి తన పాత టీమ్‌ ముంబై ఇండియన్స్‌కు మారిపోతున్నాడనే ప్రచారం జరగడమే. ఒక జట్టుకు సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్‌ పాండ్యా.. ఐపీఎల్‌ 2024లో తిరిగి మళ్లీ ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నాడని వార్తలు వస్తున్నాయి.. దాదాపు రూ.15 కోట్లు చెల్లించి మరీ పాండ్యాను ముంబై తిరిగి రప్పించుకుంటున్నట్లు సమాచారం.

అయితే.. పాండ్యాను ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా చేసేందుకు తిరిగి తీసుకొస్తున్నారని కొంతమంది క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో పేర్కొంటున్నారు. అలాగే ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మ.. గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా వెళ్తాడనే ప్రచారం కూడా నడుస్తోంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌ను ఏకంగా ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్‌ శర్మ.. ఇప్పుడు ఫ్రాంచైజ్‌ మారుతున్నాడనే వార్తలతో క్రికెట్‌ అభిమానులతో పాటు, ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌ షాక్‌ అవుతున్నారు.  వరల్డ్‌కప్‌ పోయిన బాధలో ఉన్న వారికి ఇది మరో పెద్ద షాక్‌లా మారింది.

అయితే.. అవన్నీ వట్టి పుకార్లే అని సమాచారం. ఐపీఎల్‌ 2024లోనూ ముంబై ఇండియన్స్‌కు రోహిత్‌ శర్మనే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని, గుజరాత్‌ టైటాన్స్‌కు మారే అవకాశం లేదని క్రికెట్‌ నిపుణులు, ముంబై ఇండియన్స్‌కు సంబంధించిన వ్యక్తులు వెల్లడిస్తున్నారు. అయినా.. ఇప్పుడు ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌ను మార్చాల్సిన అవసరం లేదని, రోహిత్‌ శర్మ అద్భుతమైన కెప్టెన్‌ అని అంటున్నారు ఎంఐ ఫ్యాన్స్‌. ఒక వేళ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్‌లోకి వచ్చినా.. అతను వైస్‌ కెప్టెన్‌గా మాత్రమే కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది. భవిష్యత్తులో రోహిత్‌ శర్మ ఐపీఎల్‌కు దూరమైతే తప్పితే.. పాండ్యాకు ఇప్పట్లో ముంబై కెప్టెన్‌ అయ్యే అవకాశం లేదని సమాచారం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి