వరుస విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్న టీమిండియా జోరుకు బ్రేకులు వేసింది ఆస్ట్రేలియా. మూడు వన్డేల సిరీస్లో ఆసీస్ను వైట్వాష్ చేద్దామనుకున్న భారత్ ఆశ నెరవేరలేదు. ఆఖరి వన్డేలో కంగారూ చేతిలో మన టీమ్ 66 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. అయినా వన్డే సిరీస్ను 2-1 తేడాతో గెలుచుకుంది. మ్యాచ్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వ్యక్తిగతంగా తన పెర్పార్మెన్స్ మీద సంతోషంగా ఉందన్నాడు. అన్ని విధాలుగా టీమ్కు ఉపయోగపడే ఇన్నింగ్స్లు ఆడాలన్నదే తన టార్గెట్ అని హిట్మ్యాన్ చెప్పుకొచ్చాడు.
గత ఏడెనిమిది వన్డేల్లో భారత జట్టు ఆటతీరుపై సంతృప్తిగా ఉన్నానని రోహిత్ అన్నాడు. డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎదురయ్యే ఛాలెంజ్ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధమయ్యామన్నాడు. వేర్వురు టీమ్స్తో గ్రౌండ్లోకి దిగామని.. అయితే కఠిన సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడంలో సక్సెస్ అయ్యామని హిట్మ్యాన్ పేర్కొన్నాడు. దురదృష్టవశాత్తూ ఆఖరి వన్డేలో ఓడిపోయామని.. అయినా ఎన్నో పాజిటివ్ అంశాలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్ మీద బాగానే బౌలింగ్ చేశామన్నాడు రోహిత్. పేసర్ బుమ్రా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అతడి గేమ్ అద్భుతమని మెచ్చుకున్నాడు.
‘బుమ్రా మునుపటిలా బౌలింగ్ చేయడం వల్ల భారత్కు ఎంతో లాభం చేకూరుతోంది. బ్యాటింగ్ పిచ్ మీద కూడా బుమ్రా బౌలింగ్ ఆకట్టుకుంది. ఇన్నింగ్స్ మొదట్లో కాస్త ఎక్కువ రన్స్ ఇచ్చినా తర్వాత బాగా కంట్రోల్ చేశాడు. మెంటల్గా, ఫిజికల్గా అతడు దృఢమైన వ్యక్తి. ఒక మ్యాచ్లో రన్స్ ఇచ్చినంత మాత్రాన ప్రాబ్లమ్ కాబోదు. వరల్డ్ కప్ గురించి అంతా అడుగుతున్నారు. టీమ్లోకి ఎవరు వస్తారు? ఏవైనా ఛేంజెస్ ఉంటాయా? అని డౌట్స్ రావడం కామనే. అయితే, ప్రపంచ కప్ కోసం 15 మందిపై మాకు ఫుల్ క్లారిటీ ఉంది. తప్పకుండా సూపర్బ్ టీమ్తోనే బరిలోకి దిగుతాం. ప్రతి ఒక్కరూ తమకు ఇచ్చిన రోల్ను పోషించేందుకు రెడీగా ఉన్నారు. అప్పుడే మన జట్టు ఛాంపియన్గా నిలవగలదు’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి: 24 ఏళ్లకే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మ్యాంగో మ్యాన్!