iDreamPost

Virat-Rohit: కోహ్లీ, రోహిత్ టీ20 కెరీర్​పై అప్​డేట్.. ఆ విషయాన్ని BCCIకి చెప్పేశారు!

  • Published Jan 05, 2024 | 1:21 PMUpdated Jan 05, 2024 | 7:38 PM

టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 కెరీర్​పై ఎన్నో అనుమానాలు ఏర్పడ్డాయి. ఈ ఫార్మాట్​లో వీళ్లు కంటిన్యూ అవుతారా? లేదా తప్పుకుంటారా? అనేది క్లారిటీ లేకుండా పోయింది. అయితే దీనిపై తాజాగా అప్​డేట్ వచ్చింది. వాళ్లిద్దరూ తమ మనసులో ఉన్న విషయాన్ని బీసీసీఐకి చెప్పేశారు.

టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 కెరీర్​పై ఎన్నో అనుమానాలు ఏర్పడ్డాయి. ఈ ఫార్మాట్​లో వీళ్లు కంటిన్యూ అవుతారా? లేదా తప్పుకుంటారా? అనేది క్లారిటీ లేకుండా పోయింది. అయితే దీనిపై తాజాగా అప్​డేట్ వచ్చింది. వాళ్లిద్దరూ తమ మనసులో ఉన్న విషయాన్ని బీసీసీఐకి చెప్పేశారు.

  • Published Jan 05, 2024 | 1:21 PMUpdated Jan 05, 2024 | 7:38 PM
Virat-Rohit: కోహ్లీ, రోహిత్ టీ20 కెరీర్​పై అప్​డేట్.. ఆ విషయాన్ని BCCIకి చెప్పేశారు!

భారత క్రికెట్ జట్టు లెక్క సరిచేసింది. ఫస్ట్ టెస్ట్​లో తమను చావుదెబ్బ తీసిన సౌతాఫ్రికాను రెండో టెస్ట్​లో చిత్తు చేసింది. సఫారీ టీమ్​ను వాళ్ల సొంతగడ్డపై ఫస్ట్ ఇన్నింగ్స్​లో 55 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్​లో ఫర్వాలేదనిపించి 98 రన్స్ లీడ్​ను సాధించింది రోహిత్ సేన. రెండో ఇన్నింగ్స్​లోనూ ప్రొటీస్​ను బంతితో భయపెట్టిన టీమిండియా.. ఘనవిజయాన్ని అందుకొని టూర్​ను సక్సెస్​ఫుల్​గా ముగించింది. ఇన్నేళ్ల టెస్ట్ క్రికెట్ హిస్టరీలో బంతుల పరంగా ఇది అత్యంత త్వరగా ముగిసిన మ్యాచ్ కావడం విశేషం. 106.2 ఓవర్లలోనే ఈ మ్యాచ్​లో రిజల్ట్ వచ్చేసింది. సౌతాఫ్రికా టూర్ ముగిసిపోవడంతో నెక్స్ట్ జరిగే టోర్నమెంట్స్​పై భారత్ ఫోకస్ చేస్తోంది. ఈ ఏడాది జూన్​లో టీ20 వరల్డ్ కప్​ ఉన్న నేపథ్యంలో పొట్టి ఫార్మాట్ మ్యాచులపై దృష్టి పెడుతోంది. ఈ తరుణంలో రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 కెరీర్ గురించి అప్​డేట్ వచ్చేసింది.

టీ20ల్లో ఆడేందుకు తాము రెడీగా ఉన్నామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చెప్పేశారని తెలుస్తోంది. టీ20 జట్టు సెలక్షన్​కు తాము అందుబాటులో ఉంటామని.. పొట్టి ఫార్మాట్​లో టీమిండియా తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని బోర్డుకు తెలిపారట. జనవరి 11వ తేదీ నుంచి ఆఫ్ఘానిస్థాన్​తో స్వదేశంలో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది భారత్. దీంతో ఈ సిరీస్​కు స్క్వాడ్​ను సెలక్ట్ చేసేందుకు ఎస్ఎస్ దాస్, సలీల్ అంకోలాతో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాము టీమ్ సెలక్షన్​కు అందుబాటులో ఉంటామని హిట్​మ్యాన్, కింగ్ కోహ్లీ చెప్పారని తెలిసింది. ఆఫ్ఘాన్​తో పాటు ఇంగ్లండ్​తో 5 టెస్టులకు కూడా టీమ్​ను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లీ, రోహిత్ తమ నిర్ణయాన్ని చెప్పడంతో ఆఫ్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్​లో వీళ్లు బరిలోకి దిగడం ఖాయం.

టీ20 వరల్డ్ కప్-2022 తర్వాత నుంచి కోహ్లీ, రోహిత్​ పొట్టి ఫార్మాట్​కు దూరంగా ఉంటున్నారు. గతేడాది వన్డే వరల్డ్ కప్ ఉండటంతో టెస్టులతో పాటు 50 ఓవర్ల ఫార్మాట్​ మీదే ఫోకస్ చేస్తూ వచ్చారు. అయితే టీ20 ప్రపంచ కప్​కు టైమ్ దగ్గర పడుతుండటంతో వీళ్లు పొట్టి ఫార్మాట్​లోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్​గా, ఓపెనర్​గా టీమ్​ను ముందుండి నడిపించే రోహిత్​తో పాటు ఇన్నింగ్స్​ను బిల్డ్ చేస్తూ, మ్యాచుల్ని ఫినిష్ చేస్తే కోహ్లీ అవసరం టీమిండియాకు ఉంది. అందుకే వీళ్లిద్దర్నీ ఎలాగైనా టీ20 వరల్డ్ కప్​లో ఆడించాలని సీనియర్‌‌ క్రికెటర్లు, అభిమానుల నుంచి భారీగా డిమాండ్లు వచ్చాయి. అయితే ఎట్టకేలకు టీ20ల్లో ఆడేందుకు వాళ్లు ఒప్పుకోవడంతో వచ్చే ప్రపంచ కప్​లో భారత్ ఫేవరెట్స్​లో ఒకటిగా బరిలోకి దిగనుంది. మరి.. కోహ్లీ, రోహిత్ టీ20ల్లో కమ్​బ్యాక్ ఇవ్వనుండటంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Ravi Shastri: ఇలాంటి సిరీస్ దండగ.. IND vs SA టెస్ట్ సిరీస్ పై రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి