iDreamPost

దారుణం.. కన్నకూతుళ్లకు విషమిచ్చి చంపిన తల్లిదండ్రులు.. ఎందుకంటే?

దారుణం.. కన్నకూతుళ్లకు విషమిచ్చి చంపిన తల్లిదండ్రులు.. ఎందుకంటే?

ఇటీవల చాలామంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురి అవుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మనిషి తీవ్ర నిరాశకి‌లోనై జీవితంపై విరక్తి చెంది కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యకు పాల్పపడుతున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. కనీపెంచిన పిల్లలంటే ఎవరికైనా ప్రాణమే.. తమ పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు. అలాంటిది పంజాబ్‌లో ముగ్గురు ఆడపిల్లలను తల్లిదండ్రులు విషమిచ్చి చంపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చిది. వివరాల్లోకి వెళితే..

పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ముగ్గురు ఆడపిల్లలను కన్నతల్లిదండ్రులే అత్యంత కిరాతకంగా విషం ఇచ్చి చంపారు. ట్రంకు పెట్టెలో ముగ్గురు ఆడపిల్లల మృతదేహాల మిస్టరీ వీడిపోయింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. జలంధర్ జిల్లాకు కొంత కాలం క్రితం వలస కూలీలుగా వచ్చారు సుశీల్, మీన దంపతులు. ఈ క్రమంలో తమ ముగ్గురు ఆడపిల్లలు అమృత, సాక్షి, కంచన్ ఆడుకోవడానికి బయటకు వెళ్లారని.. తిరిగి రాలేదని ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కేసు విచారణలో భాగంగా స్థానికులను.. పిల్లల స్నేహితులను ఆరా తీశారు. ఉదయం నుంచి వారు తమకు కనిపించలేదని చెప్పడంతో ముగ్గురు ఆడపిల్లలు ఇంట్లోనే ఉండి ఉంటారని భావించారు. ఇంటికి వచ్చిన పోలీసులు అణువణువు గాలించారు. ఈ క్రమంలోనే ఓ ట్రంకు పెట్టెలో ముగ్గురు పిల్లల మృతదేహాలు కనిపించాయి. దీంతో నిందుతులైన తల్లిదండ్రులు సుశీల్ మండల్, మీనను అదుపులోకి తీసుకొని తమదైన కోణంలో ప్రశ్నించారు.

దినసరి కూలీ చేసుకుంటూ ముగ్గురు పిల్లలను పెంచలేక పాలలో విషం కలిపి పిల్లలకు ఇచ్చినట్లు తమ నేరం ఒప్పుకున్నారు. తమకు ఐదుగురు సంతానమని.. హత్య చేసిన రోజు రెండేళ్ల బాబు, ఏడాదిన్నర ఉన్న కూతురు తమతో పనికి తీసుకు వెళ్లినట్లు పోలీసు విచారణలో తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కన్న పిల్లలను హతమార్చిన ఘటన తీవ్ర కలకం రేపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి