డార్లింగ్ ప్రభాస్కు గుడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే కనిపిస్తోంది. ‘బాహుబలి’ సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్గా మారాడీ హీరో. దీంతో డార్లింగ్తో సినిమాలు తీసేందుకు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఎగబడ్డారు. ‘బాహుబలి’ మూవీ తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరగడంతో ఆయన నెక్స్ట్ సినిమాలపై ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకాయి. కానీ వాటిని అందుకోవడంలో ఆయన తర్వాతి చిత్రాలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. ప్రభాస్ యాక్ట్ చేసిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ మూవీస్ డిజాస్టర్స్గా నిలిచాయి. ‘ఆదిపురుష్’ కమర్షియల్గా వర్కవుట్ అయినప్పటికీ.. ఆడియెన్స్ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. ఓం రౌత్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా చుట్టూ అల్లుకున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు.
మూవీ రిజల్ట్స్తో ఇబ్బందుల్లో ఉన్న ప్రభాస్కు గుడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే కనిపిస్తోంది. ఆయన ఇప్పుడు క్రేజీ మూవీస్ను లైనప్లో పెడుతున్నారు. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’తో పాటు ‘రాజా డీలక్స్’ సినిమాల్లో డార్లింగ్ నటిస్తున్నారు. వీటిల్లో ఇప్పటికే ‘సలార్’ టీజర్ రిలీజై యూట్యూబ్ను షేక్ చేసింది. అందులో ప్రభాస్ లుక్స్, మేనరిజమ్స్, యాక్షన్కు పాజిటివ్ టాక్ వచ్చింది. తాజాగా విడుదలైన ‘ప్రాజెక్ట్ కే’ గ్లింప్స్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ‘కల్కీ 2898 ఏడీ’గా ఈ మూవీ టైటిల్ను గ్లింప్స్తో చెప్పేసిన నాగ్ అశ్విన్.. ఇందులో ప్రభాస్ను నెక్స్ట్ లెవల్లో చూపించారు. రెబల్ స్టార్ను చూపించాల్సిన విధానం ఇది కదా అనేలా గ్లింప్స్ వీడియో ఉంది.
అమెరికా కాలిఫోర్నియాలోని సాన్ డీగోలో నిర్వహించిన ప్రతిష్టాత్మక కామిక్ కాన్లో ‘ప్రాజెక్ట్ కే’ టైటిల్ను మేకర్స్ రివీల్ చేశారు. అలాగే గ్లింప్స్ను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత మీడియాతో మూవీ టీమ్ ఇంటరాక్ట్ అయింది. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ స్టార్లు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్తో కలసి వర్క్ చేస్తారా? అని ప్రభాస్ను అక్కడి మీడియా అడిగింది. దీనికి డార్లింగ్ స్పందిస్తూ.. ‘హా, కచ్చితంగా. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ నా ఫ్రెండ్స్. మేం ముగ్గురం కలసి పని చేస్తాం. మా కాంబోలో ఒక సినిమా పక్కాగా ఉంటుంది’ అని చెప్పారు. ఇప్పుడీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ మాటలు విన్న మూవీ లవర్స్.. డార్లింగ్ చెప్పేది ‘మహాభారతం’ గురించేనని అంటున్నారు. మహేష్ బాబుతో తాను తీస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ29’ మూవీ తర్వాత రాజమౌళి తెరకెక్కించనున్న ‘మహాభారతం’లో ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ కలసి నటిస్తారని నెటిజన్స్ చెబుతున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్టులో ప్రభాస్, చరణ్, తారక్ను రాజమౌళి తప్పకుండా తీసుకుంటారని.. కాబట్టి ఈ స్టార్ కాంబో ఆ చిత్రంలో కలసి కనిపిస్తారని కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే గనుక బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే. ముగ్గురు పాన్ ఇండియా స్టార్లు కలసి నటిస్తే ఆడియెన్స్కు అంత కంటే ఆనందం ఏముంటుంది! మరి.. ప్రభాస్, చెర్రీ, తారక్ కలసి నటిస్తే చూడాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#ProjectK #Kalki2898 star Prabhas confirms he would like to work with #RRR stars Ram Charan and N.T. Rama Rao Jr. soon pic.twitter.com/VN80RVEUZE
— The Hollywood Reporter (@THR) July 21, 2023