iDreamPost

ప్రముఖ గాయకుడు మృతి.. ఇటీవలె పద్మశ్రీ ప్రకటించిన కేంద్రం.. అందుకోకుండానే..

ప్రముఖ గాయకుడు మరణించారు. ఇటీవలె ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. అది అందుకోకుండానే ఆయన తుది శ్వాస విడిచారు.

ప్రముఖ గాయకుడు మరణించారు. ఇటీవలె ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. అది అందుకోకుండానే ఆయన తుది శ్వాస విడిచారు.

ప్రముఖ గాయకుడు మృతి.. ఇటీవలె పద్మశ్రీ ప్రకటించిన కేంద్రం.. అందుకోకుండానే..

సంగీత ప్రపంచంలో విషాదం నెలకొంది. ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయకుడు ధృపదాచార్య పండిట్ లక్ష్మణ్ భట్ తైలాంగ్‌ (93) మరణించారు. ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. పద్మ అవార్డును అందుకోకుండానే తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో జైపూర్‌లోని దుర్లబ్జీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. జైపూర్‌కు చెందిన పండిట్ లక్ష్మణ్ భట్ తన జీవితమంతా సంగీత సాధనకు అంకితం చేశారు. ఆయన మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ధృపదాచార్య పండిట్ లక్ష్మణ్ భట్ తైలాంగ్‌ కుమార్తె ప్రొఫెసర్ మధు భట్ తైలాంగ్ మాట్లాడుతూ “గత కొన్ని రోజులుగా నాన్నగారి ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స కోసం దుర్లభ్‌జీ ఆసుపత్రిలో చేర్పించాం. చికిత్స సమయంలోనే ఆయన ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.’ అని తెలిపారు. పండిట్ తైలాంగ్ జీవితమంతా పాడటంలోనే గడిచిపోయింది. పండిట్ లక్ష్మణ్ భట్ తైలాంగ్‌ బనస్థలి విద్యాపీఠ్, రాజస్థాన్ సంగీత సంస్థలో సంగీత ఉపన్యాసకుడిగా ఆయన పనిచేశారు. 1985లో జైపూర్‌లో ‘రసమంజరి’ పేరుతో ఒక సంగీతోపాసన కేంద్రాన్ని ఆయన స్థాపించారు. అక్కడ ఎందరికో ఉచితంగానే విద్యను అందించారు. జైపూర్‌లో ‘అంతర్జాతీయ ధ్రుపద్-ధామ్ ట్రస్ట్’ని స్థాపించి పేదవారికి సహాయ సహకారాలు అందించారు. ఈ క్రమంలో ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి