iDreamPost

నిజమాబాద్ లో యువకుల పాడు పని! ఐదుగురు మహిళలతో..!

నిజమాబాద్ లో యువకుల పాడు పని! ఐదుగురు మహిళలతో..!

నిజమాబాద్ జిల్లాలో ఇద్దరు యువకులు పాడు పనికి తెర లేపారు. ఏకంగా ఐదుగురు మహిళలను ఇంట్లోకి తెచ్చి సీక్రెట్ గా గలీజ్ దందాకు తెర లేపారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు గ్రామస్తులు వెంటనే స్థానిక పోలీసులకు సమచారం అందించారు. హుటాహుటిన పోలీసులు ఆ ఇంట్లో దాడి చేయగా పాడు పని బయటపడింది. ఈ ఘటనలో ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతే కాకుండా ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. నిజమాబాద్ 3వ టౌన్ కు చెందిన మలావత్ రవీందర్, ముద్దసాని స్వారాజ్ అనే ఇద్దరు యువకులు సీక్రెట్ గా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఐదుగురు మహిళలను ఓ ఇంట్లోకి తీసుకొచ్చి ఈ పాడు పనికి తెరలేపారు. ఇదే విషయాన్ని తెలుసుకున్న కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వ్యభిచార నిర్వాహకులైన రవీందర్, ముద్దసాని స్వారాజ్ లను అరెస్ట్ చేశారు. దీంతో పాటు ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి