iDreamPost
android-app
ios-app

విషాదం: పెళ్లి కావడం లేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

  • Published Aug 08, 2023 | 9:55 PM Updated Updated Aug 08, 2023 | 9:55 PM
  • Published Aug 08, 2023 | 9:55 PMUpdated Aug 08, 2023 | 9:55 PM
విషాదం: పెళ్లి కావడం లేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి కావడం లేదని ఓ యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం సోమార్ పేట గ్రామంలో ప్రవీణ్ రెడ్డి (38) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు.

ఇతడు కొంత వరకు చదువుకున్నాడు. అయితే కొన్ని పరిస్థితుల దృష్ట్యా ప్రవీణ్ రెడ్డి పెళ్లి చేసుకోలేదు. ఇక పెళ్లి చేసుకోవాలని అనుకున్న ఆ వ్యక్తికి అతని తల్లిదండ్రులు సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. కానీ, ఇతనిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే ఆ యువకుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇక ఈ జీవితానికి నాకు పెళ్లి కాదేమోనని ప్రవీణ్ తరుచు బాధపడేవాడట. ఇక తనకు పెళ్లి కాదని భావించిన ప్రవీణ్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు.

ఇందులో భాగంగానే ప్రవీణ్ రెడ్డి తాజాగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుని అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పెళ్లి కావడం లేదని ఆత్మహత్య చేసుకున్న ఇతని నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: HYDలో దారుణం.. భార్యను చంపి పిల్లలతో పరారైన భర్త!

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet giriş