iDreamPost

‘నిర్భయ’ దోషి మైనర్ కాదు

‘నిర్భయ’ దోషి మైనర్ కాదు

ఢిల్లో లో 2012 లో జరిగిన నిర్భయ కేసు లో పవన కుమార్ గుప్తా అనే దోషి మైనర్ కాదని ట్రయిల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది. తాను మైనర్ ని అంటూ పవన్ చేసుకున్న రివ్యూ పిటిషన్ ను తోసిపుచ్చింది. దోషి తరఫున ఏపీ సింగ్ వాదనలు వినిపిస్తూ.. ఘటన జరిగే నాటికి పవన్ మైనర్ అని పేర్కొన్నారు. ఇందుకు సంభందించిన మరిన్ని ఆధారాలు సమర్పించేందుకు సమయం కావాలని అడిగారు. కాగా ఇదే విషయమై ట్రయిల్ కోర్టులో విచారణ జరిగిందని, కోర్టు దోషి మైనర్ కాదని తీర్పు నిచ్చిందని నిర్భయ తల్లిదండ్రుల తరఫున వాదిస్తున్న లాయర్లు కోర్టుకు తెలిపారు. ఈ మేరకు స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ సురేష్ కుమార్ కైత్ కేసు విచారణను జనవరి 24కి వాయిదా వేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి