iDreamPost
android-app
ios-app

ఊహించని దర్శకుడితో సినిమా ?

  • Published Mar 28, 2021 | 7:40 AM Updated Updated Mar 28, 2021 | 7:40 AM
ఊహించని దర్శకుడితో సినిమా ?

మొదటి సినిమాతోనే వంద కోట్ల గ్రాస్ సాధించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్న వైష్ణవ్ తేజ్ కు ఉప్పెన ఇచ్చిన బ్రేక్ సామాన్యమైనది కాదు. ప్రేక్షకులు గుర్తిస్తే చాలనుకుంటే ఏకంగా తనకంటూ మార్కెట్ ఏర్పరుచుకునే స్థాయి వచ్చేసింది. ఇంకో రెండు  హిట్లు పడితే సెటిలైపోయినట్టే. క్రిష్ దర్శకత్వంలో ఎప్పుడో పూర్తి చేసిన సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాని మీద ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. అక్టోబర్ దాకా ఎక్కడా పెద్ద గ్యాప్ లేకపోవడంతో కాస్త లేట్ అయినా మంచి డేట్ చూసుకుని వచ్చేలా ప్లానింగ్ జరుగుతున్నట్టుగా తెలిసింది. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో హీరోయిన్.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం వైష్ణవ్ తేజ్ తన నెక్స్ట్ సినిమా గిరిసాయతో చేయబోతున్నట్టు సమాచారం. ఇతను అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ఆదిత్య వర్మతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ దర్శకుడు చెప్పిన లైన్ నచ్చడంతో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా త్వరలో ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అర్జున్ రెడ్డిని మొదట బాలా తమిళ రిమేక్ చేసినప్పుడు అది బాగా రాలేదని సందీప్ రెడ్డి వంగా శిష్యుడు గిరిసాయకు ఆ ఛాన్స్ ఇచ్చారు. అతను అంచనాలను ఓ మాదిరిగా బాగానే అందుకున్నారు. ఇప్పుడు చెప్పింది మాత్రం స్ట్రెయిట్ సబ్జెక్టని తెలిసింది.

వైష్ణవ్ తేజ్ కోసం ఎదురు చూస్తున్న చిన్న మరియు మీడియం రేంజ్ దర్శకుల లిస్టు పెద్దగానే ఉంది. కొందరు స్టార్ డైరెక్టర్లు కూడా ఇతని కోసం కథలు సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. లాక్ డౌన్ అయ్యాక క్రాక్ తర్వాత అంతకు మించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన మూవీ హీరోగా వైష్ణవ్ కు ఒక ఫాలోయింగ్ అంటూ ఏర్పడింది. ఇంకా ఓటిటి రిలీజ్ షెడ్యూల్ చేయలేదు. వచ్చ్చే నెల జరగడం ఖాయం. త్వరలో స్టార్ మాలో కూడా వరల్డ్ ప్రీమియర్ వేయబోతున్నారు. థియేటర్లో ఉప్పెన మిస్ అయినవాళ్లను ఈ రెండు రూపాల్లో మరోసారి పరిచయం కాబోతున్నాడు. మొత్తానికి కుర్రాడి టైం బాగుంది