iDreamPost
iDreamPost
స్టార్ హీరోలు నటించడమే కాదు దర్శకత్వం చేయడం కథలు రాయడం మరీ సాధారణం కాదు కానీ అరుదుగా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. స్వర్గీయ ఎన్టీఆర్ ఎన్ని అద్భుతమైన ఆణిముత్యాలు ఇచ్చారో చరిత్ర ఎన్నటికీ మర్చిపోదు. కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలోనే కృష్ణ బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించి డైరెక్ట్ చేసి తన మల్టీ టాలెంట్స్ ని నిరూపించుకున్నారు. కథలు ఇచ్చిన హీరోలు లేకపోలేదు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన అశ్వద్ధామకు స్టోరీ రాసింది నాగ శౌర్యనే. అయితే గతంలో రజనీకాంత్ ఓ సినిమాకు కథ స్క్రీన్ ప్లే రాశారంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఇది నిజం. 1993లో ప్రతిష్టాత్మక విజయ సంస్థ తమిళంలో ‘వల్లి’ తీసింది. రజని స్నేహితుడు నటరాజ్ దర్శకత్వంలో ప్రియరామన్ ని హీరోయిన్ గా పరిచయం చేయగా ఇళయరాజా సంగీతం సమకూర్చారు.