iDreamPost
android-app
ios-app

పోలవరం-పరుగులు !

  • Published Jan 06, 2021 | 2:16 PM Updated Updated Jan 06, 2021 | 2:16 PM
పోలవరం-పరుగులు !

ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇరుకున పెట్టాలి అన్నదే ప్రస్తుతం ఏపీలో టీడీపీ చేస్తున్న పని. అధికారంలో ఉన్నప్పుడు తాము చేసిన అరాచకాలకు, పుష్కరాలు, అమరావతి, పోలవరం..ఇలా తెలుగు తమ్ముల్లు చేసిన దోపిడీని భరించలేని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ప్లేట్ పిరాయించారు. టీడీపీని అడ్రస్ గల్లంతు చేశారు. నాటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.. నేను నిద్రపోను.. మిమ్ములను నిద్ర పోనివ్వనంటూ.. అధికారంలో ఉన్నప్పుడు బీరాలు పలికిన చంద్రబాబుకే ప్రజలు కంటిమీద కునుకు లేకుండా చేశారు.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రజల పక్షాన పాలన సాగిస్తున్నారు.. అమరాలతి లో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ ను బయటకు లాగుతున్నారు.. పోలవరంలో జరిగిన అవినీతికి చెక్ పెట్టి, రివర్స్ టెండరింగ్ తో ప్రజాధనాన్ని ఆదా చేశారు. అంతేకాదు తెలుగు తమ్ముళ్ల అవినీతిని బయటకు లాగుతున్నారు. ఈ పరిణామాలతో టీడీపీ తమ అవినీతి బాగోతం ఎక్కడ బయట పడుతుందో అన్న ఆందోళన రోజురోజురోజుకు పెరిగి పోతోంది.. ఆ భయంతోనే ప్రభుత్వాన్ని అడుగడుగునా ఇబ్బందులు పెట్టేందుకు నీచమైన ఆలోచనలు చేస్తున్నారు. ఇంతకాలం కోర్టులను అడ్డం పెట్టుకున్న చంద్రబాబుకు, దానివల్ల కూడా ప్రయోజనం లేదని తేలిపోయింది. అందుకే గుడులపై దాడులను రాజకీయం చేస్తున్నారు.. అయితే ప్రజాపక్షం వహించిన సీయం జగన్ అన్నింటిని ధీటుగా ఎదుర్కొంటున్నారు..

ఇక ఆసలు విషయానికి వస్తే.. ఏపీకి నిజంగ వరం పోలవరం.. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఆశించిన స్థాయిలో పనులు చేయలేదు. కానీ ప్రస్తుతం మాత్రం రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని అటకెక్కించింది అనే విధంగా సందు దొరికితే చాలు టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరి పోలవరాన్ని నిజంగానే వైసీపీ సర్కార్ అటకెక్కించిందా?,, అన్న మీమాంస ప్రజల్లో కలుగుతోంది. ఆ మీమాంసను నివృత్తి చేయడానికి జగన్ సర్కార్ నాడు-నేడు పోలవరం పేరుతో అప్పటి,ఇప్పటి పనులను చిత్రాల రూపంలో విడుదల చేసింది. వాటిని చూసే మందు పోలవరం గత, ప్రస్తుత పరిస్థితి ఏమిటో ఓ లుక్కేద్దాం!

Also Read: రాజకీయ పేలాలు ఏరుకుంటున్న చంద్రబాబు

స్పిల్ వే…

స్పీల్ వే మొత్తం 53 బ్లాకులు..పొడవు 1118 .4 మీటర్లు.. పౌండేషన్ లెవెల్ 18.5 మీటర్ల నుండి 10 మీటర్ల వరకు ఉంటుంది. స్పిల్ వే క్రస్ట్ లెవెల్ 25.72 మీటర్లు. అయితే గత ప్రభుత్వం ఐదేళ్లలో కొన్ని బ్లాకులు మాత్రమే +34 మీటర్ల లెవెల్ వరకు కాంక్రీట్ పనులు పూర్తిచేసింది. జూన్ 2019 నాటికి.
నేడు అంటే వైసీపీ ప్రభుత్వహయాంలో స్పిల్ వే పిల్లర్లు పూర్తి లెవెల్ +55 మీటర్లు కాగా ప్రస్తుతం +54 మీటర్లు పూర్తి అయింది. మొత్తం స్పిల్ వే పిల్లర్లు, స్లాబులు కాంక్రీట్ పనులు అన్నీ త్వరలోపూర్తి కానున్నాయి.

రేడియల్ గేట్లు…

టీడీపీ ప్రభుత్వ హయాంలో వే క్రస్ట్ లెవెల్ + 25.72 మీటర్లు. అందులో మొత్తం గేట్లసంఖ్య 48. గేటు వెడల్పు 16 మీటర్లు. ఎత్తు 20 మీటర్లు. ఈ 48 గేట్లును మూసివేయడం ద్వారా రిజర్వాయర్ పూర్తి లెవెల్ +45.72 మీటర్ల వరకూ 194.60 శతకోటి ఘనపుటడుగుల నీటి నిల్వ చేయవచ్చు. ఈగేట్లు బిగించుటకు స్పిల్ వే స్తంభములను +54.00 మీటర్ల ఎత్తు వరకు పూర్తిచేయాలి. కానీ స్పిల్ వే స్తంభములు 54 మీటర్లు పూర్తి చేయకుండానే +34 మీటర్ల ఎత్తువద్దనే తాత్కాలికంగా ఐరన్ రేకును గేటులా అమర్చారు. దీన్ని గేట్ల బిగింపుగా ప్రచారం చేశారు. కాగా ప్రస్తుతం మొత్తం 48 రేడియల్ గేట్లకు గాను 9 గేట్లను ఇప్పటికే బిగించారు. మిగిలిన గేట్లు పూర్తిచేసేందుకు పనులు జరుగుతున్నాయి.

Also Read: రాజకీయ ధ్వంస రచన!

స్పిల్ వే బ్రిడ్జ్ కాంక్రీట్ గడ్డర్లు…

స్పిల్ వే బ్రిడ్జ్.. కాంక్రీట్ గడ్డర్ల మీద ఆధార పడి ఉంది. మొత్తం 48 స్లాబ్ లకు 192 నిలువు గడ్డర్లు ఉంటాయి. ఒక్కొక్క గడ్డర్ పొడవు 21 మీటర్లు ఉంటుంది. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో మొత్తం 192 గడ్డర్లకు గాను 22 గడ్డర్లు మాత్రమే పూర్తిచేసింది. కాగా ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం 18 నెలల కాలంలో మొత్తం 170 గడ్డర్లు పూర్తిచేసింది.

స్పిల్ వే బ్రిడ్జ్ స్లాబులు…

48 గేట్లకు సంబంధించిన ఖాళీలపైన స్లాబ్ లు వేయాలి. ఒక్కొక్క స్లాబ్ పొడవు సుమారు 21.5 మీటర్లు. వెడల్పు 9.75 మీటర్లు. మందం 0.45 మీటర్లు. ఇటువంటి 48 స్లాబులకు గాను టీడీపీ ప్రభుత్వం ఒక్క స్లాబ్ కూడా ప్రారంభించలేదు. కానీ ప్రస్తుతం 48 స్లాబులకు గాను 40 స్లాబుల నిర్మాణం పూర్తయింది. మొత్తం స్లాబులు 15, ఫిబ్రవరి 2021 నాటికి పూర్తి అయ్యేలా పనులు సాగుతున్నాయి.

ట్రనియన్ గడ్డర్లు…

48 గేట్లను స్పిల్ వేలో బిగించడానికి ,వాటిని ఆపరేట్ చేయడానికి నిర్వహించడానికి గాను 49 ట్రనియన్ గడ్డర్లను 49 పిల్లర్ల ప్రవాహపు క్రింద వైపున వాలుగా ఏర్పాటు చేయాలి. రేడియల్ గేట్ల యొక్క ఆర్మ్ గడ్డర్లను వీటితో అనుసంధానం చేసి, గేట్లను ఆపరేట్ చేస్తారు, మొత్తం 300 టన్నుల బరువైన గేటు వీటిపై ఆధార పడి ఉంటుంది. ఈగేట్లు బిగించాలంటే . ట్రనియన్ గడ్డర్లు పూర్తి చేయాలి. కాని అవి పూర్తి కాలేదు. హైడ్రాలిక్ సిలిండర్లు బిగించ డానికి +45.00 మీటర్ల ఎత్తులో ఫల్క్రంస్ బిగించాలి. అవీ బిగించలేదు. పిల్లర్ల లెవెల్ కనీసం 54.00 మీటర్ల వరకు పూర్తి కావాలి. ఇవేవీ గడిచిన ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో పూర్తి కాకపోవడం వల్ల ట్రనియల్ గడ్డర్ల పనులు జరగడం లేదు. కాగా ప్రస్తుతం 49 ట్రనియన్ గడ్డలర్లకు గాను 40 గడ్డర్లు పూర్తి చేశారు. మిగిలిన గడ్డర్లు అన్నీ జనవరి 2021 చివరి నాటికి పూర్తయ్యేలా పనులు జరుగుతున్నాయి.

పవర్ హౌజ్ పునాదుల తవ్వకం….

పోలవరం విద్యుత్ కేంద్రం ఒక్కోటి 80 మెగా వాట్ల సామర్ధ్యం కలిగి 12 యూనిట్లతో మొత్తం 960 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా డిజైన్ చేసారు. పవర్ హౌస్ కొరకు కొండను +135 మీటర్ల నుంచి +12 మీటర్ల వరకు తవ్వాలి. దీనిలో +135 మీటర్ల నుండి +110 మీటర్ల వరకు 2014 సంవత్సరానికి ముందే త్రవ్వకం పనులు పూర్తి చేశారు. కాగా గత ప్రభుత్వం +110 మీటర్లన నుంచి +92 మీటర్ల వరకు మాత్రమే పూర్తిచేసింది. అంటే పద్దెనిమిది మీటర్లు మాత్రమే పూర్తి చేసింది. ఇంకనూ 80 మీటర్లు ఎత్తు త్రవ్వకం పనులు చేయాల్సిఉంది. ఇంకనూ 90 మీటర్ల పనులు చేయాల్సి ఉంది. కాగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో +92 మీటర్ల నుండి పనులు మొదలు పెట్టి రోజుకు సరాసరి ఆరువేల క్యూబిక్ మీటర్ల చొప్పున త్రవ్వడం జరుగుతోంది. మొత్తం తవ్వకం పనులు ఈ మార్చి నాటికి పూర్తవుతాయి.

Also Read: భూమా అఖిలప్రియ అరెస్ట్‌

పునరావాసం మరియు పునర్నిర్మాణం…

వాస్తవానికి ప్రాజెక్టు కింది నిర్వాసితులైన 1,05,601 కుంటుంబాలకు పునరావాసం కల్పించాలి. గత ప్రభుత్వం ఐదేళ్లకాలంలో 15 పునరావాస కేంద్రాల్లో 1,846 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తి చేసింది. అందలో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం 47 ఆర్ అండ్ ఆర్ కాలనీలలో 11,500 ఇళ్ల నిర్మాణం పూర్తిచేసింది. 17,860 నిర్వాసిత కుటుంబాలకు 2021 నాటికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుటుంది.

స్పిల్ వే ఛానల్…

గతంలో కాపర్ డ్యాం ప్రణాళికా బద్దంగా నిర్మించక పోవడం వల్ల 2019లో వచ్చిన వరదలకు స్పిల్ వే అంతా వరదనీటితో, బురద నీటితో నిండిపోయింది. దీంతో ప్రస్తుత ప్రభుత్వం వరదల తర్వాత పనులు ప్రారంభించడానికి స్పిల్ వే నుంచి సుమారు ఒక టీఎంసీ నిటిని తోడాల్సివచ్చింది. అది పూర్తి చేయడానికి గత ఏడాది నవంబర్ నుంచి ఫిబ్రవరి వరక సమయం పట్టింది. ఈలోగా కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ వలన మార్చి నుంచి జూన్ వరకు అతి స్వల్పంగా చేయాల్సి వచ్చింది. తిరిగి జులై 2020న వరదలు వచ్చి స్పిల్ ఛానెల్ నుంచి నీరు వెళ్లడం వలన పనులకు ఆటంకం ఏర్పడింది. దీంతో బురద నీటిని, మట్టిని తొలగించుకుంటూనే కాంక్రీటు బ్లాకు వేయడం జరుగుతోంది. ఈ పనులన్నీఈ ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

కాపర్ డ్యామ్…

ఏర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ ను నిరాటంకంగా నిర్మించుటకు, వచ్చే వరద నీటిని అడ్డుకోవడానికి ఎగువ, దిగువ కాఫర్ లు నిర్మించాలి. గతంలో ఎగువ కాఫర్ డ్యామ్ 2,340 మీటర్ల పొడవు 42.50 మీటర్ల లెవెల్ వరకు నిర్మించాల్సి ఉంది. దీనికి గాను గోదావరి మధ్యలో 1200 మీటర్ల పొడవు, +28.00 మీటర్ల +33.00 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే నిర్మించారు. అందులోనూ పాక్షికంగానే గత ఐదేళ్లలో పనులు జరిగాయి. ఇక దిగువ కాఫర్ డ్యాం విషయానికి వస్తే 1617 మీటర్ల పొడవు, 30.50 మీటర్ల లెవెల్ వరకు నిర్మించాల్సి ఉంది. దీనిలో 950 మీటర్లు పొడవు మాత్రమే పాక్షికంగా నిర్మించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన డీజైన్లు అన్ని ఆమోదించడం జరిగింది. ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులు ప్రస్తుతం ప్రణాళికా బద్దంగా జరుగుతున్నాయి. జూన్ 2021 నాటికి పనులు పూర్తి అయ్యేలా పనులు జరుగుతున్నాయి.

గ్యాప్ -III కాంక్రీట్ డ్యామ్….

గ్యాప్ -III కాంక్రీట్ డ్యామ్ పొడవు 153.50 మీటర్లు. పైన వెడల్పు 8.5 మీటర్లు. సగటు ఎత్తు 22.32 మీటర్లు. ఇందులో ఉన్న బ్లాకులు తొమ్మిది. గత ఐదేళ్లలో గ్యాప్ -III కాంక్రీట్ డ్యామ్ డిజైన్లు సమర్పించ లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్క పనిమొదలు కాలేదు. ప్రస్తు ప్రభుత్వ హయాంలో డిజైన్లను కేంద్రం జలశక్తి మండలి ఆమోదించింది. పనులు ప్రారంభం అయ్యాయి. ఫౌండేషన్ మట్టి పని 12000 క్యూబిక్ మీటర్లు పూర్తి చేయడం జరిగింది. మొత్తం కాంక్రీటు పని 16000 క్యూబిక్ మీటర్లు ఏప్రిల్ 2021 నాటికి పూర్తి అయ్యేలా పనులు సాగుతున్నాయి.

గ్యాప్-I మట్టి మరియు రాతి కట్టడం…

గ్యాప్-I ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ పొడవు 564 మీటర్లు. పైన వెడల్పు 12.5 మీటర్లు. ఎత్తు 29.32 మీటర్లు. డయాఫ్రం వాల్ పొడవు 388 మీటర్లు. మొత్తం పానెల్స్ సంఖ్య 84. కానీ గత ప్రభుత్వ హాయాంలో గ్యాప్-I ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ డిజెన్లు సమర్పించలేదు. పనులు ప్రారంభం కాలేదు. కానీ దీనికి సంబంధించిన డిజైన్లకు కేంద్ర జల శక్తి మండలి ఆమోదం లభించింది. ఫౌండేషన్ పనులు రెండు రిగ్గులతో జరుగుతున్నాయి. జూన్ 2021 నాటికి పనులన్నీ పూర్తి అయ్యేలా ముందుకు సాగుతున్నాయి.

కుడి మరియు ఎడమ కాలువలకు నీటిని అందించే సొరంగం పనులు…

గత ప్రభుత్వ హయాంలో ఎడమ వైపు ఇరిగేషన్ టన్నెల్ ప్రారంభించ బడలేదు, కుడి వైపు ట్విన్ టన్నెల్స్ లైనింగ్ చేయలేదు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఎడమ కాలువకు నీటిని అందించడానికి 919 మీటర్ల పొడవు, 18 మీటర్ల వ్యాసంతో టన్నెల్ నిర్మించాలి. దీనికి 3.65 లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని తవ్వకం పని చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1.75 లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తి అయింది. డిసెంబర్ 2021 నాటికి మిగతా పని పూర్తి అయ్యేలా ప్రణాళికతో పనులు ముందుకు సాగుతున్నాయి.