iDreamPost
android-app
ios-app

మైక్రోసాఫ్ట్ చైర్మన్‌ సత్య నాదెళ్ల కుమారుడు మృతి

మైక్రోసాఫ్ట్ చైర్మన్‌ సత్య నాదెళ్ల కుమారుడు మృతి

మైక్రోసాఫ్ట్ కార్ప్ ఎక్జిక్యూటివ్ చైర్మన్‌, సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల కన్నుమూశారు. 26 సంవత్సరాల జైన్ నాదెళ్ల సెరిబ్రల్ పాల్సీ అనే అరుదైన వ్యాధితో జన్మించారు. జైన్ మరణించినట్లు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉద్యోగులకు ఇమెయిల్ ద్వారా తెలియజేసింది. అంతేకాక ఈ ఇమెయిల్లో సత్య నాదెళ్ల కుటుంబం కోసం ప్రార్థించాలని కూడా ఉద్యోగులను కోరారు.

2014లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, సత్య నాదెళ్ల వికలాంగ వినియోగదారులకు మెరుగైన సేవలందించేలా కంపెనీ ఉత్పత్తుల రూపకల్పనపై దృష్టి సారించారు. సత్య నాదెళ్ల- అనుపమ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

అసలు ఏమిటీ సెరిబ్రల్ పాల్సీ?

ఈ సెరిబ్రల్ పాల్సీ చిన్న పిల్లలకు శాపంగా మారే ఒక రుగ్మత. కొన్ని కేసుల్లో ఇది ప్రాణాంతకం కాకపోవచ్చు కానీ చికిత్స లేని ఓ ఆరోగ్య స్థితి. దీన్ని వ్యాధి అని కూడా అనలేం. ఎందుకంటే మెదడులో ఒక భాగం పనిచేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. ప్రతి వెయ్యి మంది పిల్లల్లో అయిదు మందిలో ఈ సెరిబ్రల్ పాల్సీ కనిపిస్తోందని చెప్పవచ్చు. మెదడులో సెరెబ్రమ్ అనే భాగం దెబ్బతినడం వల్ల ఈ సెరిబ్రల్ పాల్సీ కలుగుతుంది. దీన్ని మెదడు పక్షవాతం అని కూడా అంటుంటారు వైద్యులు. దీనికి ఎలాంటి చికిత్స లేదు సరికదా ఎందుకు ఈ పరిస్థితి వస్తుందని చెప్పడానికి కూడా సరైన ప్రామాణికం లేదు.

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetsuperbetinMeritbet güncel girişJojobet GirişcasibomCasibom GirişHoliganbetgalabetHoliganbetMarsbahis GirişCasibomJojobetHoliganbetJojobetHoliganbet