iDreamPost
android-app
ios-app

రైల్వే లో ఇక ఆహారం బహు ప్రియం

రైల్వే లో ఇక ఆహారం బహు ప్రియం

ట్రైన్ల లో ఆహారం మరింత ప్రియమైనది. టీ, టిఫిన్‌, భోజనం రేట్లను పెంచుతూ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సర్క్యూలర్ జారీ చేసింది. సర్క్యులర్ ప్రకారం, రాజధాని, శాతాబ్ది, దురంతో ఎక్స్‌ప్రెస్‌లలో పెంచిన రేట్లు అమలు లోకి వస్తాయి. కొత్త మెనూ, రేట్లు టికెటింగ్ విధానంలో 15 రోజుల తరువాత అందిస్తామని, పెంచిన రేట్లు సర్క్యులర్ జారీ చేసిన తేదీ నుండి 120 రోజుల తరువాత వర్తిస్తాయని తెలిపింది.

రేట్ల సవరణ తరువాత రాజధాని, దురంతో, శాతాబ్డి ఎక్స్‌ప్రెస్‌లలో ఒక కప్పు టీ ధర రూ .10 నుండి రూ .15 కు పెరిగింది. ఇదే స్లీపర్ క్లాస్‌, సెకండ్ క్లాస్ ఏసీ బోగీల్లో అయితే టీ ధర రూ .20 గా మారింది. భోజనం విషయానికొస్తే, దురంతో ఎక్స్‌ప్రెస్ స్లీపర్ క్లాస్‌లో లంచ్‌/ డిన్నర్‌ గతంలో 80 రూపాయలు కాగా ప్రస్తుతం 50 శాతం పెంచుతూ రూ. 120 రూపాయిలు చేసింది. ఈ రైళ్లలో సాయంత్రం వేళలో ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో టీ ధర రూ.35 (రూ .6 పెంపు) అల్పాహారం రూ. 140, (రూ .7 పెంపు) లంచ్‌ డిన్నర్ రూ .245 (రూ .15 పెరిగింది)