iDreamPost
android-app
ios-app

Crime News ఫేస్​బుక్ ప్రియుడి వేధింపులు, మ‌రో ఫేస్​బుక్ ఫ్రెండ్ తో హత్యచేయించిన గృహిణి

  • Published May 12, 2022 | 11:38 AM Updated Updated May 12, 2022 | 12:39 PM
Crime News ఫేస్​బుక్ ప్రియుడి వేధింపులు, మ‌రో ఫేస్​బుక్ ఫ్రెండ్ తో హత్యచేయించిన గృహిణి

ఫేస్​బుక్ ప్రియుడి వేధింపులు, మ‌రో ఫేస్​బుక్ ఫ్రెండ్ తో హత్యచేయించిన వివాహిత‌

బాగ్ అంబర్ పేటకు చెందిన యశ్మకుమార్(32) ఫొటోగ్రాఫర్. అతనికి 2018లో మీర్ పేట ప్రశాంతి హిల్స్ కు చెందిన శ్వేతారెడ్డి (32) ఫేస్​బుక్ లో పరిచయమైంది. చాటింగ్ మోతాదు పెరిగింది. చనువు పెరగడంతో యశ్మకుమార్, శ్వేతను నగ్నంగా వీడియో కాల్ చేయాలని అడిగ్గా.. ఆమె అలానే చేసింది.

ఆ వీడియో కాల్ ను రికార్డు చేసిన యశ్మకుమార్, రూటు మార్చాడు. తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే వీడియోను నెట్టింట్లో పెడతానని బెదిరిస్తూ వచ్చాడు. నెలరోజులుగా వేధింపులు ఎక్కువవడంతో, శ్వేతారెడ్డి ఫేస్ బుక్ లో పరిచయమైన మ‌రో ఫ్రెండ్ కొంగల అశోక్ (28)కు ఫోన్ చేసింది. యశ్మకుమార్ ను చంపాల‌ని కోరింది. కృష్ణాజిల్లా తిరువూరు మండలానికి చెందిన అశోక్, మే 4వ తేదీన హైదరాబాద్ కు వచ్చి, కార్తీక్ తో కలిసి యశ్మకుమార్ ను దారుణంగా కొట్టాడు. ఆ త‌ర్వాత పరారయ్యారు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన యశ్మకుమార్ మే6న మృతి చెందగా.. బాగ్ అంబర్ పేట్ పోలీసులు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. సీసీ ఫుటేజీలతో కేసు మిస్టరీని చేధించారు. నిందితులైన శ్వేతారెడ్డి, అశోక్, కార్తీక్ లను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.

marsbahis girişjojobetjojobet girişjojobetjojobet girişjojobet girişjojobet giriş