Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ సర్కార్ పాలన సాఫీగా సాగకూడదని కోరుకునే వారిలో ఆంధ్రజ్యోతి యాజమాన్యం కూడా ఒకటి. అవకాశం లభించిన ప్రతి సారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోనూ, పొరుగు రాష్ట్రం తెలంగాణలోని కేసీఆర్ సర్కార్తో ఏపీ సర్కార్కు గొడవలు పెట్టే ప్రయత్నాలు గత రెండేళ్లలో ఆంధ్రజ్యోతి చేసింది. ఇదే తీరును తాజాగా ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదంలోనూ ఆంధ్రజ్యోతి కొనసాగించింది. ఇరు రాష్ట్రాల మధ్య గొడవలు పెంచేలా.. గోడ మీద పిల్లి వాటాన్ని ఆంధ్రజ్యోతి కృష్ణా జిలాల వివాదంలో అనుచరించింది.
కృష్ణా బేసిన్లో ఉభయ రాష్ట్రాల మధ్య ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో నీరు డెడ్ స్టోరేజీలో ఉన్నా.. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేయడంపై ఏపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టులు నిండకుండా.. వచ్చిన నీటిని వచ్చినట్లు వాడుతూ.. దిగువకు వదులుతుండడంతో శ్రీశైలం నుంచి సాగర్కు అక్కడ నుంచి పులిచింతలకు, అక్కడ విద్యుత్ ఉత్పత్తి తర్వాత ప్రకాశం బ్యారేజీకి వదులుతుండడంతో.. జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. ఫలితంగా కృష్ణా డెల్టా ఆయకట్టుకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం నెలకొంది. అయితే విద్యుత్ ఉత్పత్తి తమ హక్కు అంటున్న తెలంగాణ.. ఏపీ ఆందోళను ఏ మాత్రం పట్టించుకోకుండా విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ నీటిని దిగువకు విడుదల చేస్తూనే ఉంది.
వాస్తవ పరిస్థితిని వివరిస్తూ.. జరిగే నష్టాన్ని తెలియజేయాల్సిన సమయంలో.. ఆంధ్రజ్యోతి గొడ మీద పిల్లి మాదిరిగా వ్యవహరిస్తూ ఇరు రాష్ట్రాల మధ్య గొడవలు పెంచేలా రాతలు రాస్తోంది. ఏ ఎండకు ఆ గొడుగు అనే సామెత మాదిరిగా ఈ రోజు ఆంధ్రజ్యోతి కృష్ణా జిలాల విషయంలో రాసుకొచ్చింది. ఏపీ ఎడిషన్లో.. కృష్ణా నీళ్లు కడలిపాలు.. జలాశయాల్లో అడుగుంటిన నిల్వలు.. తెలంగాణ నిర్వాకంతో సముద్రంలోకి వృథాగా జలాలు.. అక్రమ విద్యుత్ ఉత్పత్తితో సాగుకు చేటు.. అంటూ రాసుకొచ్చింది. అదే సమయంలో తెలంగాణ ఎడిషన్లో మాత్రం.. ఆయకట్టు మురిసేలా నిల్వలు.. కృష్ణా ప్రాజెక్టులోకి 90.53 టీఎంసీల వరద.. జూలై చివరి నాటికి శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు ఫుల్ అవుతాంటూ రాసుకొచ్చింది.
ఏపీ ఎడిషన్లో మాత్రం తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయడం తప్పు అంటూ పేర్కొన్న ఆంధ్రజ్యోతి.. అదే సమయంలో తెలంగాణ ఎడిషన్లో మాత్రం.. విద్యుత్ ఉత్పత్తి చేయడం సరైనదేనంటూ.. పైగా గత ఏడాది ఈ సమయానికి ఉన్న నిల్వల కన్నా ఈ ఏడాది శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో ఎక్కుగానే నీటి నిల్వలు ఉన్నాయంటూ చెబుతూ.. కేసీఆర్ సర్కార్ చేస్తున్న పని సరైనదేననేలా తెలంగాణ ప్రజలు భావించేలా రాసుకొచ్చింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంత్సంబంధాలు ఉండకూడదని ఆశించే ఆంధ్రజ్యోతి.. రాబోయే రోజుల్లో ఈ మాదిరిగా.. ఏ గాలికి ఆ చాప ఎత్తే రాతలు ఇంకెన్ని రాస్తుందో చూడాలి.
Also Read : కృష్ణా జలాల వివాదంలో ఆకుకి అందకుండా, పోకకి చెందకుండా టీడీపీ ఎందుకున్నట్టు..?