iDreamPost

ఏపీలో మరో కొత్త శాఖ

ఏపీలో మరో కొత్త శాఖ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ సర్కార్‌ మరోకొత్త శాఖ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, అందుకు అవసరమైన అనుమతులు త్వరితగతిన ఇచ్చేందుకు, మౌలిక సదుపాయాల కల్పించేందుకు జగన్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రత్యేక శాఖను జగన్‌ సర్కార్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పరిపానల వికేంద్రీకరణలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయల పర్యవేక్షణ బాధ్యతలను ఈ శాఖ పరిధిలోకి తెచ్చారు. తాజాగా ఏర్పాటు చేసిన పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖతో కలిపి జగన్‌ ప్రభుత్వం నూతనంగా రెండు శాఖలను ఏర్పాటు చేసినట్లైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి