iDreamPost

Murder in Mahim OTT: అరుదుగా వచ్చే సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఇష్టమా? ఈ వెబ్ సిరీస్ మిస్ కావద్దు!

  • Published May 07, 2024 | 7:23 PMUpdated May 07, 2024 | 7:23 PM

ప్రతి వారం మొదటిలో వచ్చే సినిమాలే కాకుండా ఓటీటీ లో.. మధ్య మధ్యలో కూడా కొన్ని సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్.. కూడా వస్తూనే ఉంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఒకటి వచ్చేసింది. అదేంటో చూసేద్దాం..

ప్రతి వారం మొదటిలో వచ్చే సినిమాలే కాకుండా ఓటీటీ లో.. మధ్య మధ్యలో కూడా కొన్ని సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్.. కూడా వస్తూనే ఉంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఒకటి వచ్చేసింది. అదేంటో చూసేద్దాం..

  • Published May 07, 2024 | 7:23 PMUpdated May 07, 2024 | 7:23 PM
Murder in Mahim OTT: అరుదుగా వచ్చే సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఇష్టమా?  ఈ వెబ్ సిరీస్ మిస్ కావద్దు!

ప్రతి వారం.. ఈ వారం రాబోయే సినిమాలు ఇవే అంటూ.. కొన్ని సినిమాల లిస్ట్ వచ్చేస్తుంది. అయితే, ఆ వారంలో కేవలం ఆ సినిమాలు, సిరీస్ లు మాత్రమే రిలీజ్ అవుతాయి అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే అవి కాకుండా ఇంకా వారం మధ్యలో కూడా కొన్ని కొన్ని సినిమాలు,సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని కొత్త సినిమాలు, సిరీస్ లు లిస్ట్ యాడ్ అవ్వగా.. ఇక ఇప్పుడు మరొక సినిమా రెడీ అయిపోతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ వెబ్ సిరీస్ పేరు.. మర్డర్ ఇన్ మహిమ్.. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇప్పటివరకు క్రైమ్ థ్రిల్లర్ తరహాలో ఎన్నో సినిమాలు, సిరీస్ లు వచ్చాయి కానీ.. ఈ సిరీస్ మాత్రం కాస్త డిఫ్ఫరెంట్. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్ కు మంచి క్రేజ్ నడుస్తుంది. కాబట్టి మేకర్స్ ఇంకాస్త ఎఫెక్టివ్ గా.. ఈ క్రైమ్ థ్రిల్లర్ జోనర్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సైకాలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ కూడా అలాంటివే. ఈ సిరీస్ లో.. విజయ్ రాజ్, అషుతోశ్ రాణా, శివానీ రఘువంశీ ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ వెబ్ సిరీస్ జియోసినిమా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సిరీస్ మే 10 నుంచి జియో సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. పైగా ఈ సిరీస్ తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలి, మరాఠీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

ఇక ఇప్పటికే ఈ సిరీస్ నుంచి విడుదల చేసిన టీజర్.. ప్రేక్షకులకు మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఈ సిరీస్ కు రాజ్ అచార్య దర్శకత్వం వహించారు. ముంబైలోని మాహిమ్ అనే రైల్వే స్టేషన్ లో జరిగే.. ఓ యువకుడి మర్డర్ మిస్టరీ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతూ ఉంటుంది. ఇది 2013 బ్యాక్డ్రాప్ తో కొనసాగే కథ. పైగా ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే.. ఈ హత్య కేసును విచారించే వ్యక్తి కొడుకే ఈ కేసులో అనుమానితుడిగా ఉంటాడు.అసలు నిందితుడు ఎవరు అనేదే.. ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీస్ అంటే ఇష్టపడే వాళ్లకు ఈ సిరీస్ బాగా నచ్చేస్తుంది. మరి ఈ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి