iDreamPost

మాజీ సీఎం కుమారుడిపై లైంగిక వేధింపుల కేసు!

మాజీ సీఎం కుమారుడిపై లైంగిక వేధింపుల కేసు!

అన్నాడీఎంకే సీనియర్‌ నాయకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం కుమారుడు ఎంపీ రవీంద్రనాథ్‌ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. రవీంద్రనాథ్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. న్యూడ్‌ కాల్స్‌ చేయాలంటూ రవీంద్ర తనను తరచూ వేధిస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ వివరాల్లోకి వెళితే.. తాజాగా, ఓ యువతి డీజీపీ ఆఫీస్‌కు వెళ్లింది. ఎంపీ రవీంద్రపై డీజీపీకి ఫిర్యాదు చేసింది.

ఆ ఫిర్యాదులో..  ‘‘ ఎంపీ రవీంద్ర గత కొన్ని నెలలుగా నన్ను వేధిస్తున్నాడు. ఆయన నాకు తరచుగా ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. న్యూడ్‌ వీడియో కాల్స్‌ సైతం చేయమంటున్నాడు. తాను చెప్పినట్లు చేయకపోతే చంపేస్తానని కూడా బెదిరిస్తున్నాడు. నాకు రవీంద్ర నుంచి ప్రాణ హాని ఉంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం మీడియా ముందు ఎంపీ రవీంద్ర తనతో వాట్సాప్‌లో చాట్‌ చేసిన స్క్రీన్‌ షాట్ల దృశ్యాలకు సంబంధించిన జిరాక్స్‌లను మీడియా ముందు ప్రదర్శించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి