iDreamPost

చంద్రబాబు పూనిన చంద్రముఖిలా పిచ్చిగంతులేస్తున్నాడు.. పవన్​పై రోజా కామెంట్స్!

  • Author singhj Published - 06:55 PM, Fri - 14 July 23
  • Author singhj Published - 06:55 PM, Fri - 14 July 23
చంద్రబాబు పూనిన చంద్రముఖిలా పిచ్చిగంతులేస్తున్నాడు.. పవన్​పై రోజా కామెంట్స్!

వాలంటీర్లను ఉద్దేశించి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్​ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్​లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. పవన్​ మీద మంత్రులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. పవన్​కు వ్యతిరేకంగా వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. ఇప్పుడీ వివాదంపై మంత్రి ఆర్​కే రోజా స్పందించారు. అధికార పక్షం, ప్రతిపక్షం కాకుండా నడుమ ఉన్న పనికిమాలిన పార్టీ సచివాలయ వ్యవస్థపై గగ్గోలు పెడుతోందని పరోక్షంగా పవన్​పై ఆమె ఫైర్ అయ్యారు. వాలంటీర్ వ్యవస్థ మీద ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్స్ దుర్మార్గమని ఆమె అన్నారు.

ప్రజలు అందరూ వాలంటీర్లకు మద్దతుగా నిలవాలని రోజా పిలుపునిచ్చారు. పవన్​తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద కూడా రోజా మండిపడ్డారు. చంద్రబాబు పూనిన చంద్రముఖిలా పవన్ కల్యాణ్​ పిచ్చిగంతులు వేస్తున్నాడంటూ ఆమె సీరియస్ అయ్యారు. ‘పవన్ కల్యాణ్​ ఒక పనికిమాలినోడు. కరోనా సమయంలో చంద్రబాబు, పవన్ హైదరాబాద్​లో దాక్కున్నారు. ఇప్పుడు మీకు చప్పట్లు కొట్టేవారికి కరోనా టైమ్​లో సేవలు అందించింది వాలంటీర్లే. చంద్రబాబు పూనిన చంద్రముఖిలా పవన్ పిచ్చిగంతులు వేస్తున్నాడు’ అని రోజా చెప్పుకొచ్చారు.

చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో మోసం జరిగితే నోరెందుకు లేవలేదని పవన్​పై సీరియస్ అయ్యారు రోజా. ఆయనకు అసలు చట్టాల గురించి ఏమాత్రం తెలియదన్నారు. చంద్రబాబు రాసి ఇచ్చిన స్క్రిప్ట్​ను చదవడమే పవన్​కు తెలుసునని పేర్కొన్నారు. అందరూ కష్టాల్లో ఉండాలని పవన్ అనుకుంటున్నాడా అని ఆమె ప్రశ్నించారు. పవన్ సంస్కారం గురించి చెబితే సన్నీ లియోన్ వేదాలు వల్లించినట్లుందని రోజా విమర్శించారు. ఎవరి మాటా వినడు కాబట్టే పవన్​ను భార్యలు వదిలేశారని ఆమె దుయ్యబట్టారు. ఎన్​సీఆర్ రిపోర్టులో తెలంగాణ టాప్​లో ఉందన్న రోజా.. అక్కడ మాట్లాడితే కేసీఆర్ మక్కెలు విరగ్గొడతారని భయమా అని నిలదీశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి