iDreamPost

దేవరలో నేను చాలా స్పెషల్.. రివీల్ చేసిన హీరోయిన్!

  • Published Mar 23, 2024 | 9:52 AMUpdated Mar 23, 2024 | 9:52 AM

యంగ్ టైగర్ ఎన్​టీఆర్, కొరటాల శివ కాంబీనేషన్ లో మరోసారి భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా దేవర. కాగా, ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ తో పాటు మరో కథనాయిక కూడా నటించనుందనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వార్తలను నిజం చేస్తూ దేవరలో నటిస్తున్న మరో హీరోయిన్ అందులో తన పాత్ర ఇలా ఉంటుందని రివీల్ చేసింది.

యంగ్ టైగర్ ఎన్​టీఆర్, కొరటాల శివ కాంబీనేషన్ లో మరోసారి భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా దేవర. కాగా, ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ తో పాటు మరో కథనాయిక కూడా నటించనుందనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వార్తలను నిజం చేస్తూ దేవరలో నటిస్తున్న మరో హీరోయిన్ అందులో తన పాత్ర ఇలా ఉంటుందని రివీల్ చేసింది.

  • Published Mar 23, 2024 | 9:52 AMUpdated Mar 23, 2024 | 9:52 AM
దేవరలో నేను చాలా స్పెషల్.. రివీల్ చేసిన హీరోయిన్!

యంగ్ టైగర్ ఎన్​టీఆర్, కొరటాల శివ కాంబీనేషన్ లో మరోసారి భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. కాగా, ఈ సినిమాను కొరటాల కోస్టల్ బ్యాగ్ డ్రాప్ తో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా.. రెండు పాత్రాల్లో రూపొందించనున్నారు. అయితే ఇందులో హీరోయిన్ గాదివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్ కు పరిచయం కానుంది. ఇప్పటికే దేవరకు సంబంధించిన గ్లింప్స్, పోస్టర్స్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేయడంతో.. వీటిని చూసిన ప్రేక్షకులకు, ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందన్న టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆమె మరెవరో కాదు, మరాఠీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న గుజరాతీ అమ్మాయి శ్రుతీ మరాఠే. అయితే తాజాగా ఈ బ్యూటీ దేవర చిత్రంలో తన పాత్ర ఇలా వింటుదని స్వయంగా వెల్లడించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఈ ఏడాది రిలీజ్ కానున్న ది మోస్ట్‌ అవైటెడ్‌ మూవీస్‌ లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ‘దేవర’ కూడా ఒకటి. కాగా, ఈ సినిమాను మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌లో కొరటాల శివ తెరకెక్కిస్తుండగా.. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టైలిష్‌ యాక్టర్‌ సైఫ్‌ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే దేవర నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఈ సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. అలాగే జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ కావడంతో రోజురోజుకీ దేవరపై ప్రేక్షకుల్లో హైప్‌ అనేది పెరిగిపోతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ తో పాటు మరో కథనాయికగా గుజరాతీ అమ్మాయి ‘శ్రుతీ మరాఠే‘ నటించనుందని గత కొన్నిరోజులుగా వస్తున్న వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. తాజాగా తాను దేవరలో నటిస్తున్నట్లు ఆమె స్వయంగా వెల్లడించింది.

Actress shruti marathe about devara

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రుతి మాట్లాడుతూ.. ‘దేవర సినిమాలో నేను భాగం అయినట్లు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసింది. ఇక నేను ఆ సినిమాలో దేవరకు భార్యగా కనిపిస్తాను. కాగా, ఈ సినిమా అక్టోబర్ 10న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. అయితే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులతో పాటు నేను కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని చెప్పారు. దీంతో దేవరలో ఇద్దరు హీరోయిన్లు అనే విషయం పై క్లారిటీ వచ్చేసింది. కాగా,ఇందులో ఎన్టీఆర్ డబుల్ రోల్ లో నటిస్తున్న విషయంపై ఖాయం అయినట్లు తేలిపోయింది.

ఇక ఈ సినిమా షూట్‌లకు సంబంధించి తాజాగా జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ నెట్టింట తెగ వైరలవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ అనేది గోవాలో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఎన్టీఆర్‌ ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు దేవర లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్‌ 10న థియేటర్లలో విడుదల చేయనున్నారు. మరి, దేవరలో ఎన్టీఆర్ కు భార్యగా హీరోయిన్ శ్రుతీ మరాఠే నటింస్తుందనే విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి