iDreamPost

Heeramandi: హీరా మండిలో బోల్డ్‌ రోల్‌.. మనీషా రెమ్యూనరేషన్‌ ఎంతంటే!

  • Published May 07, 2024 | 12:41 PMUpdated May 07, 2024 | 12:41 PM

ఈ మధ్య కాలంలో వచ్చిన వెబ్ సిరీస్ లలో ఎక్కువ వ్యూవర్ షిప్ తో దూసుకుపోతున్న వెబ్ సిరీస్ "హీరమండి: ది డైమండ్ బజార్". మొదటి సారి ఓ వెబ్ సిరీస్ కు ఓ సినిమాకు కేటాయించినంత భారీ బడ్జెట్ ను కేటాయించారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో నటించిన వారి రెమ్యునిరేషన్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.

ఈ మధ్య కాలంలో వచ్చిన వెబ్ సిరీస్ లలో ఎక్కువ వ్యూవర్ షిప్ తో దూసుకుపోతున్న వెబ్ సిరీస్ "హీరమండి: ది డైమండ్ బజార్". మొదటి సారి ఓ వెబ్ సిరీస్ కు ఓ సినిమాకు కేటాయించినంత భారీ బడ్జెట్ ను కేటాయించారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో నటించిన వారి రెమ్యునిరేషన్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.

  • Published May 07, 2024 | 12:41 PMUpdated May 07, 2024 | 12:41 PM
Heeramandi: హీరా మండిలో బోల్డ్‌ రోల్‌.. మనీషా రెమ్యూనరేషన్‌ ఎంతంటే!

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్.. సంజయ్ లీల బన్సాలి మొదటి సారి దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్.. “హీరమండి: ది డైమండ్ బజార్”. ఈ సిరీస్ గురించి అనౌన్స్ చేసినప్పటినుంచి.. రిలీజ్ వరకు కూడా అందరికి ఎంతో ఆసక్తిని కలిగించింది. ఇక సిరీస్ రిలీజ్ తర్వాత కూడా.. ఈ వెబ్ సిరీస్ అంతే సూపర్ హిట్ట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సిరీస్ అన్ని భాషలలోను ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో దూసుకుపోతుంది. ఒక వెబ్ సిరీస్ ఇంత భారీ బడ్జెట్ ను కేటాయించడం ఇదే మొదటి సారి కాగా.. ఆ స్థాయిని ఇప్పుడు హీరమండీ వెబ్ సిరీస్ నిలబెట్టుకుందని చెప్పి తీరాలి. ఇక ఈ సిరీస్ లో నటించిన నటీమణులంతా కూడా పారితోషకం ఘనంగానే తీసుకున్నారట. వారు తీసుకున్న పారితోషకం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

ఈ వెబ్ సిరీస్ లో.. స్టార్ హీరోయిన్స్ దగ్గర నుంచి.. సీరియల్ హీరోయిన్స్ వరకు చాలా మంది నటించారు. బ్రిటిష్ వారి పరిపాలనలో 1940ల కాలం బ్యాక్డ్రాప్ తో ఈ సిరీస్ ను రూపొందించారు. హీరామండీ అనే రెడ్ లైట్ ప్రాంతంలో.. జీవనం సాగించే కొంతమంది డ్యాన్సర్స్ జీవితాల గురించి.. ఈ సిరీస్ లో చూపించారు. ఆ కాలంలో మహిళలు ఎదుర్కున్న ఎన్నో సమస్యలను.. ఈ సిరీస్ లో కళ్ళకు కట్టినట్లు చూపించారు. అయితే, ఈ వెబ్ సిరీస్ లో నటించిన వారి రెమ్యునిరేషన్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ సిరీస్ కు దర్శకత్వం వహించినందుకు సంజయ్ 65 కోట్ల పారితోషకం అందుకున్నారట. ఇక నటీమణుల విషయానికొస్తే.. ఈ సిరీస్ లో మనిషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరి, సంజీదా శేఖర్ లాంటి వారు బోల్డ్ క్యారెక్టర్స్ లో నటించిన సంగతి చూశాము… మనిషా కొయిరాలా ఈ సిరీస్ లో చద్దా రజ్జో పాత్రను పోషించింది. అందుకుగాను ఆమె కోటి రూపాయల రెమ్యునిరేషన్ అందుకుంది.

ఇక అదితి రావ్ హైదరి విషయానికొస్తే.. ఆమె ఈ సిరీస్ లో తన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆమె దాదాపు 1-1.5 కోట్ల వరకు రెమ్యునిరేషన్ పుచ్చుకుంది. సోనాక్షి సిన్హా ఈ సిరీస్ లో తన పాత్రకు గాని అత్యధికంగా 2 కోట్ల రెమ్యునిరేషన్ అందుకుందట. ఇలా ఎంతో మంది నటీ నటులు ఈ సిరీస్ లో అద్భుతమైన నటనను కనబరిచి.. దానికి తగిన పారితోషకాన్ని పుచ్చుకున్నారు. సంజయ్ లీల భన్సాలీ సినిమాలలో ఎక్కువగా అందరిని మూవీ సెట్స్ ఏ అట్ట్రాక్ట్ చేస్తాయి. అదే విధంగా ఈ సిరీస్ లో కూడా అలాంటి సెట్స్ తోనే అందరికి ఆకర్షించారు. ఇప్పటికైతే ఈ సిరీస్ అద్భుతంగా అందరి నుంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి