iDreamPost

ఇన్‌స్టాలోకి నయన్‌ ఎంట్రీ.. ఫస్ట్‌ పోస్టే అదుర్స్‌!

ఇన్‌స్టాలోకి నయన్‌ ఎంట్రీ.. ఫస్ట్‌ పోస్టే అదుర్స్‌!

సౌత్‌ ఇండియా లేడీ అమితాబ్‌ నయనతార ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన గంటలోనే లక్షకుపైగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె రెండు పోస్టులు పెట్టారు. ఒకటి తన బిడ్డలతో ఉన్నది కాగా.. మరోటి తన తాజా చిత్రం ‘జవాన్‌’ ట్రైలర్‌. మొదటి పిల్లల పోస్టులో ‘నేను వచ్చానని చెప్పు’ అంటూ ఓ మాస్‌ డైలాగ్‌ పెట్టారు. ఇందుకు రజినీ జైలర్‌ సాంగ్‌ను జత చేసి చంటి బిడ్డలతో స్టైల్‌గా లుక్కులిచ్చారు.

ఈ రెండు పోస్టులకు రెండు లక్షలకు పైగా లైకులు రావటం విశేషం. ఇక, ఇవే పోస్టులను ఆమె తన ఇన్‌స్టా స్టోరీలుగా కూడా పెట్టారు. నయన్‌ ఇన్‌స్టా ఎంట్రీతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయిపోతున్నారు. ఫ్యాన్స్‌, నెటిజన్లతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. నయన్‌ చాలా కాలం నుంచి ట్విటర్‌లో ఖాతాను మెయిన్‌టేన్‌ చేస్తున్నారు. కానీ, ఇన్‌స్టావైపు రాలేదు. ఇప్పుడు సడెన్‌గా ఆమె ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇవ్వటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జవాన్‌ సినిమా ప్రమోషన్‌ కోసం ఎంట్రీ ఇచ్చుంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.

కాగా, ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో షారుఖ్‌ ఖాన్‌ హీరోగా ‘జవాన్‌’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో షారుఖ్‌ ఖాన్‌కు జంటగా నయనతార నటించారు. దీపికా పదుకునే గెస్ట్‌ రోల్‌ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ గురువారం విడుదలైంది. ఈ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. యూట్యూబ్‌లో విడుదలైన గంటలోనే మిలియన్ల వ్యూస్‌ సంపాదించుకుంది. ఈ సినిమా సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి, నయన్‌ ఇన్‌స్టా ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by N A Y A N T H A R A (@nayanthara)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి