iDreamPost

పండగపూట విషాదం.. ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో..!

పండగపూట విషాదం.. ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో..!

కర్నూలు జిల్లాలో పండగపూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ మహిళ ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ మహిళకు ఏం జరిగింది? ఈ ఘటనలో అసలేం జరిరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కర్నూలు జిల్లా కొక్కెరంచ గ్రామంలో నరేంద్రగౌడ-లావణ్య (24) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. కొంత కాలానికి ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. దీంతో ఈ దంపతుల సంసారం సంతోషంగానే సాగుతూ వచ్చేది. ఇదిలా ఉంటే.. కుటుంబ కలహాలతో ఈ భార్యభర్తలు గత కొంత కాలం నుంచి గొడవ పడుతున్నారు. ఇక ఆదివారం కూడా మరరోసారి గొడవ పడ్డట్లు తెలుస్తుంది. దీంతో లావణ్య తీవ్ర మనస్థాపానికి గురైంది. అదే రోజు ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో ఆ మహిళ విషగుళికలు మింగింది.

ఆమె కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో లావణ్య చికిత్స పొందుతూ తాజాగా ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకుని మృతురాలి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆమె భర్త నరేంద్ర గౌడ్, అతని తల్లిదండ్రులు లావణ్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. ఈ విషయంలో మాకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనపై స్పందించిన పోలీసులు బాధితులకు నచ్చజెప్పి ఆస్పత్రి నుంచి పంపించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పండగపూట లావణ్య మరణించడంతో వారి స్వగ్రామంలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి