iDreamPost

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టీమిండియా స్టార్ క్రికెటర్ భార్య! ఫొటోలు వైరల్..

టీమిండియా స్టార్ క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ కీలక ప్లేయర్ రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. ఆ ఫొటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

టీమిండియా స్టార్ క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ కీలక ప్లేయర్ రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. ఆ ఫొటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టీమిండియా స్టార్ క్రికెటర్ భార్య! ఫొటోలు వైరల్..

ఓ టీమిండియా స్టార్ క్రికెటర్ తండ్రైనట్లు తాజాగా ప్రకటించాడు. ఏప్రిల్ 21న తన భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు అతడు తెలిపాడు. ప్రస్తుతం ఆ క్రికెటర్ ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ తరఫున ఆడుతున్నాడు. అతడికి ఇది రెండో సంతానం కాగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

టీమిండియా స్టార్ క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ కృనాల్ పాండ్యా రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య పంఖూరి శర్మ ఏప్రిల్ 21న పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించాడు కృనాల్ పాండ్యా. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. కాగా.. కృనాల్ పాండ్యా-పంఖూరి శర్మ 2017 డిసెంబర్ 27న వివాహం చేసుకున్నారు. వీరికి 2022లో ఒక కొడుకు జన్మించాడు. అతడి పేరు కవిర్ కృనాల్ పాండ్యా. ఇక ఇప్పుడు పుట్టిన కొడుకు పేరు ‘వయు కృనాల్ పాండ్యా’గా నామకరణం చేశారు. కాగా.. ప్రస్తుతం కృనాల్ లక్నో తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ సీజన్ అంత గొప్ప ప్రదర్శన మాత్రం చేయట్లేదు. ఆల్ రౌండర్ గా పేరుగాంచిన ఇతడు ఇప్పటి వరకు ఈ ఐపీఎల్ సీజన్ లో ఆడిన 8 మ్యాచ్ ల్లో కేవలం 5 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. మరి పుత్రోత్సాహంలోనైనా రాణిస్తాడో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Krunal Himanshu Pandya (@krunalpandya_official)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి