iDreamPost

ప్రేమోన్మాది ఘాతుకం.. తనను ప్రేమించలేదనే కోపంతో.. యువతి చేత

  • Published Sep 20, 2023 | 9:06 AMUpdated Sep 20, 2023 | 9:06 AM
  • Published Sep 20, 2023 | 9:06 AMUpdated Sep 20, 2023 | 9:06 AM
ప్రేమోన్మాది ఘాతుకం.. తనను ప్రేమించలేదనే కోపంతో.. యువతి చేత

సమాజంలో ప్రేమ పేరుతో చోటు చేసుకుంటున్న దారుణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రేమించానని వెంటపడటం.. కాదంటే.. కర్కశంగా ఎదుటి వారి ప్రాణాలు తీయడం.. సర్వసాధారణం అయ్యింది. తాజాగా ఈ కోవకు చెందిన దారుణం ఒకటి వెలుగు చూసింది. అప్పటికే వివాహామై.. ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తి.. ప్రేమించమంటు.. యువతి వెంటపడ్డాడు. ఆమె అంగీకరించపోవడంతో.. దారుణానికి ఒడిగట్టాడు. యువతి మీద దాడి చేయడమే కాక.. పురుగుల మందు తాగించి హతమర్చాడు. ఈ దారుణ సంఘటన వివరాలు..

ఈ విషాదకర సంఘటన అసిఫాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట్రావ్‌పేటకు చెందిన బూడే దీప (19) ఇంటర్‌ తర్వాత చదువు మానేసి.. కూలి పనికి వెళ్తుంది. అదే గ్రామానికి దంద్రే కమలాకర్‌ అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో దీపపై కన్నేసిన కమలాకర్.. గత ఆరు నెలలుగా ప్రేమిస్తున్నానని ఆమె వెంట పడుతున్నాడు. తనను ప్రేమించకపోతే.. ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని, కుటుంబ సభ్యులందరినీ చంపుతానని బెదిరిస్తూ.. దీపను వేధింపులకు గురి చేస్తున్నాడు..

ఈ క్రమంలో మూడ్రోజుల క్రితం దీప కుటుంబ సభ్యులంతా వ్యవసాయ పనులకు వెళ్లగా.. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కమలాకర్ మృతురాలికి ఇంట్లోకి చొరబడ్డాడు. తనను ప్రేమించకుండా వేరే వాళ్లతో మాట్లాడుతున్నావంటూ ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం తన వెంట తెచ్చిన పురుగు మందును బలవంతంగా దీప నోట్లో పోశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.

బాధితురాలు బయటకు వచ్చి కాపాడాలంటూ చుట్టుపక్కల వారిని కోరగా.. వారు వెంటనే దీపను సిర్పూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం దీప ప్రాణాలు విడిచింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కమలాకర్‌ కోసం గాలిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి