iDreamPost

హేమంత్ ప్రమాణంలో కీలక పరిణామం

హేమంత్ ప్రమాణంలో కీలక పరిణామం

జార్ఖండ్‌ నూతన ముఖ్యమంత్రిగా జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) చీఫ్‌ హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర 11వ ముఖ్యమంత్రిగా గవర్నర్‌ ద్రౌపది ముర్మా ఆయనచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమం బిజెపియేతర పార్టీల బలపరీక్షకు వేదికైంది.

రాంచి లో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ముఖ్యమంత్రులు కమల్‌నాథ్‌ (మధ్యప్రదేశ్‌), భూపేశ్‌ బఘేల్‌ (ఛత్తీస్‌గఢ్‌), అశోక్‌ గెహ్లోత్‌ (రాజస్తాన్‌), మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్‌), డీఎంకే అధినేతి ఎంకే స్టాలిన్‌, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌​ యాదవ్‌, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ పాల్గొనడం గమనార్హం.

81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో జేఎంఎం 30 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్‌ 16, ఆర్జేడీ 1 స్థానం గెలుచుకున్నాయి. బిజెపి 25 స్థానాలు గెలుచుకుంది. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముంది. ఎంఎం నుంచి ఆరుగురికి, కాంగ్రెస్‌ నుంచి నలుగురికి, ఆర్జేడీ నుంచి ఒకరికి మంత్రి పదవులు దక్కనున్నాయని సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి