iDreamPost

తెలుగువాళ్లే కాదు ఇప్పుడు అందరి ఫేవరెట్​గా SRH.. ఈ మార్పుకు కారణం!

  • Published Apr 10, 2024 | 12:06 PMUpdated Apr 10, 2024 | 12:06 PM

సన్​రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు అందరి ఫేవరెట్ టీమ్​గా మారిపోయింది. అంతలోనే ఇంత మార్పుకు కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

సన్​రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు అందరి ఫేవరెట్ టీమ్​గా మారిపోయింది. అంతలోనే ఇంత మార్పుకు కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 10, 2024 | 12:06 PMUpdated Apr 10, 2024 | 12:06 PM
తెలుగువాళ్లే కాదు ఇప్పుడు అందరి ఫేవరెట్​గా SRH.. ఈ మార్పుకు కారణం!

సన్​రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్​లో హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలో ఒకటి. ఒకసారి క్యాష్ రిచ్ లీగ్​లో విన్నర్​గా నిలిచిన ఎస్ఆర్​హెచ్.. నాలుగు సార్లు ప్లేఆఫ్స్​కు వెళ్లింది. అయితే గత మూడు సీజన్లుగా మాత్రం టీమ్ దారుణంగా పెర్ఫార్మ్ చేస్తోంది. పాయింట్స్ టేబుల్​లో చివర్లో ఉన్న జట్లతో పోటీపడుతూ విమర్శలపాలవుతూ వచ్చింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ ఆటను చూసేందుకు ఎవరూ ఇష్టపడని పరిస్థితి. తెలుగు వాళ్లు తప్ప ఎవరికీ ఎస్ఆర్​హెచ్​ మ్యాచులపై ఇంట్రెస్ట్ ఉండేది కాదు. జట్టులో బిగ్ స్టార్స్ కూడా లేకపోవడంతో పట్టించుకోవడమే మానేశారు. సన్​రైజర్స్ మ్యాచ్ వస్తోంది అంటే స్కిప్ చేసే వాళ్లే ఎక్కువయ్యారు. హోమ్ గ్రౌండ్ మ్యాచెస్​లో కూడా సొంత జట్టుకు కాకుండా ఇతర టీమ్స్​కు సపోర్ట్ చేసేవాళ్లూ పెరిగారు. కానీ ఒక్క సీజన్​ గ్యాప్​లో ఊహించని మార్పులు వచ్చాయి.

తెలుగు వాళ్లే కాదు.. ఈసారి ఐపీఎల్​లో అందరి ఫేవరెట్​గా మారిపోయింది సన్​రైజర్స్. మన జట్టు మ్యాచ్ అంటే చాలు.. జనాలు ఎగబడి మరీ చూస్తున్నారు. స్టేడియాలు నిండిపోవడంతో పాటు టీవీల్లో, మొబైల్స్​లో చూసేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఎస్ఆర్​హెచ్​ మ్యాచులకు కోట్లాది వ్యూస్ వస్తున్నాయి. భారీ అభిమాన గణం ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్​తో పోటీపడుతోంది కమిన్స్ సేన. కొన్ని మ్యాచుల్లో ఆ టీమ్స్ కంటే కూడా సన్​రైజర్స్ మ్యాచులకే మరింత వ్యూస్ వస్తున్నాయి. దీనికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. జట్టు ఆటతీరు కంప్లీట్​గా మారిపోయింది. ఒకప్పుడు ఆరెంజ్ ఆర్మీ మ్యాచ్​లు అంటే లోస్కోరింగ్ ఉంటూ బోరింగ్​గా సాగేవి. కానీ ఇప్పుడు అలా కాదు.. భారీ స్కోర్లతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోంది ఎస్​ఆర్​హెచ్.

SRH is everyone's favorite now not Telugu people

ముంబై ఇండియన్స్​తో మ్యాచ్​లో ఏకంగా 277 పరుగులు చేసింది సన్​రైజర్స్. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఇదే హయ్యెస్ట్ టీమ్ స్కోర్ కావడం విశేషం. ఒక్క గుజరాత్​ మ్యాచ్​లో తప్పితే మిగతా అన్ని మ్యాచుల్లోనూ కనీసం 180కి పైగా పరుగులే చేసింది ఆరెంజ్ ఆర్మీ. జీటీ మీద 162 రన్స్ మాత్రమే చేయగలిగింది. భారీ స్కోర్లు బాదుతూ ఆడియెన్స్​కు మస్తు వినోదాన్ని పంచుతున్నారు ఎస్​ఆర్​హెచ్ బ్యాటర్లు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి విధ్వంసక ఇన్నింగ్స్​లతో ఫుల్ ఎంటర్​టైన్ చేస్తున్నారు. బౌలింగ్​, ఫీల్డింగ్​లో కూడా సన్​రైజర్స్ ప్లేయర్లు తమ 100 పర్సెంట్ ఎఫర్ట్ పెడుతున్నారు. ఆడిన 5 మ్యాచుల్లో మూడింట నెగ్గిన మన టీమ్.. మిగతా రెండు మ్యాచుల్లో ఒక దాంట్లో 4 పరుగుల తేడాతో ఓడింది.

టీ20లకు తగ్గట్లు ధనాధన్ బ్యాటింగ్, కళ్లుచెదిరే ఫీల్డింగ్, అద్భుతమైన బౌలింగ్​తో ఇతర జట్ల అభిమానుల మనసుల్ని కూడా దోచుకుంటున్నారు సన్​రైజర్స్ ప్లేయర్స్. గ్రౌండ్​లో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఆడుతున్నారు. గెలుపైనా, ఓటమైనా మ్యాచ్​ను లాస్ట్ బాల్ వరకు తీసుకెళ్తున్నారు. ఫియర్​లెస్ క్రికెట్​తో సీఎస్​కే, ముంబై లాంటి టాప్ టీమ్స్​ను చిత్తుగా ఓడించారు. సన్​రైజర్స్​తో మ్యాచ్ అంటే మిగతా జట్లు కూడా భయపడుతున్నాయి. దీంతో మన టీమ్ మ్యాచుల్ని చూసేందుకు తెలుగువారితో పాటు ఇతరులు కూడా తెగ ఆసక్తి చూపిస్తున్నారు. పంజాబ్ కింగ్స్​తో వాళ్ల సొంతగడ్డ మీద జరిగిన మ్యాచ్​లో ఎస్​ఆర్​హెచ్ టీమ్​కు ఫుల్ సపోర్ట్ లభించింది. స్టేడియంలో సన్​రైజర్స్ టీషర్ట్స్, జెండాలతో తెగ సందడి చేశారు ఫ్యాన్స్. ఈ స్థాయిలో ఆరెంజ్ ఆర్మీ మ్యాచులకు దక్కుతున్న ఆదరణ, వ్యూస్ చూస్తుంటే ఫ్యాన్ బేస్​లో ఇతర టీమ్స్​ను కమిన్స్ సేన అతి త్వరలో దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి