గాయాలతో ఇబ్బంది పడుతున్నారు టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమి, హార్దిక్ పాండ్యా. వీళ్లు ఎప్పటి వరకు కోలుకుంటారనే దానిపై క్లారిటీ లేదు. ఈ విషయం మీద తాజాగా బీసీసీఐ సెక్రటరీ జై షా రియాక్ట్ అయ్యారు.
గాయాలతో ఇబ్బంది పడుతున్నారు టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమి, హార్దిక్ పాండ్యా. వీళ్లు ఎప్పటి వరకు కోలుకుంటారనే దానిపై క్లారిటీ లేదు. ఈ విషయం మీద తాజాగా బీసీసీఐ సెక్రటరీ జై షా రియాక్ట్ అయ్యారు.
టీమిండియా మరో ఆసక్తికర సిరీస్ ఆడేందుకు సిద్ధమైపోయింది. నెల రోజుల పాటు జరిగే సఫారీ టూర్కు రెడీ అయిపోయింది. సౌతాఫ్రికాతో మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది భారత్. డిసెంబర్ 10వ తేదీన డర్బన్ వేదికగా జరిగే తొలి టీ20 మ్యాచ్తో సిరీస్ మొదలుకానుంది. ఆస్ట్రేలియాతో సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ ఈసారి కూడా భారత్ను ముందుండి నడిపించనున్నాడు. వన్డే ఫార్మాట్కు కేఎల్ రాహుల్ నేతృత్వం వహించనుండగా.. టెస్టుల్లో రోహిత్ శర్మ సారథిగా ఉంటాడు. అటు సౌతాఫ్రికా కూడా కెప్టెన్లను మార్చింది. రెగ్యులర్ కెప్టెన్ తెంబా బవుమా కేవలం టెస్టుల్లోనే టీమ్ను ముందుండి నడపనున్నాడు. వన్డేలు, టీ20ల్లో స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ సారథ్యం వహించనున్నాడు.
సౌతాఫ్రికా గడ్డ మీద గెలవడం అంత ఈజీ కాదు. సొంత గడ్డపై అలవాటైన కండీషన్స్లో మరింత రెచ్చిపోయి అటాకింగ్ గేమ్ ఆడుతుంది ప్రొటీస్. గత రికార్డులు దీనికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ముఖ్యంగా టెస్టుల్లో ఆ టీమ్ను ఓడించడం చాలా కష్టమైన పని. అయితే టీ20ల్లో మాత్రం టీమిండియాదే పైచేయి అని చెప్పాలి. ఓవరాల్గా చూసుకుంటే ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటిదాకా 26 టీ20 మ్యాచులు జరిగాయి. అందులో భారత్ 13 మ్యాచుల్లో నెగ్గగా.. సౌతాఫ్రికా 8 మ్యాచుల్లో విజయం సాధించింది. మిగిలిన మూడు మ్యాచులు రద్దయ్యాయి. సిరీస్ల పరంగా చూసుకుంటే.. ఈ రెండు జట్ల మధ్య ఒకటి కంటే ఎక్కువ మ్యాచులు ఉన్న సిరీస్లు ఐదు జరిగాయి. అందులో భారత్ రెండింటిని, సౌతాఫ్రికా ఒక్క సిరీస్ను దక్కించుకోగా.. మరో రెండు సిరీస్లు డ్రాగా ముగిశాయి. పొట్టి ఫార్మాట్లో టీమిండియా-సౌతాఫ్రికా ఫస్ట్ టైమ్ 2006లో, ఆఖరుగా 2022 వరల్డ్ కప్లో తలపడ్డాయి.
ఇక, సౌతాఫ్రికా సిరీస్కు సెలక్ట్ అయిన టీమ్లో సీనియర్ మహ్మద్ షమి ఆడటం డౌట్గా మారింది. గాయంతో బాధపడుతున్న వెటరన్ పేసర్ ప్రొటీస్తో టెస్ట్ సిరీస్కు అందుబాటులో ఉంటాడో లేదో చెప్పలేని పరిస్థితి. అతడు కోలుకునేందుకు మరింత టైమ్ పడుతుందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. పూర్తిగా రికవర్ అవ్వకముందే అతడ్ని ఆడిస్తే ఇబ్బందులు తప్పవని క్రికెట్ అనలిస్టులు అంటున్నారు. షమీని ఆడించకపోవచ్చునని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో షమి ఇంజ్యురీపై బీసీసీఐ సెక్రటరీ జై షా రియాక్ట్ అయ్యాడు. సఫారీ సిరీస్కు అతడు ఫిట్గా ఉంటాడని భావిస్తున్నానని అన్నారు. షమీతో పాటు గాయంతో బాధపడుతున్న స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా విషయం మీదా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆఫ్ఘానిస్థాన్తో టీ20 సిరీస్కల్లా అతడు ఫిట్గా ఉంటాడని చెప్పారు. సౌతాఫ్రికా టూర్ నుంచి భారత జట్టు రిటర్న్ అయిన తర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ టెన్యూర్ విషయంలో డెసిజన్ తీసుకుంటామని షా స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: IND vs SA: టీమిండియా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఫస్ట్ టీ20 జరగడం కష్టమే..!
BCCI secretary Jay Shah said – “Length of Rahul Dravid’s tenure as Team India’s head coach to be decided after team returns from South Africa”. (PTI) pic.twitter.com/vbLN9kVfMZ
— CricketMAN2 (@ImTanujSingh) December 9, 2023
Jay Shah said “Shami should be fit for the South Africa series”. [TOI] pic.twitter.com/tJsPERvc7C
— Johns. (@CricCrazyJohns) December 9, 2023