iDreamPost

Virat Kohli: ఇంగ్లండ్​ సిరీస్ నుంచి కోహ్లీ ఔట్.. అభిమానుల కోరిక అలాగే ఉండిపోయింది!

  • Published Feb 10, 2024 | 3:50 PMUpdated Feb 10, 2024 | 3:50 PM

ఇంగ్లండ్​తో జరుగుతున్న టెస్టు సిరీస్ నుంచి భారత సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. కింగ్ దూరమవడంతో అభిమానుల కోరిక అలాగే ఉండిపోయింది.

ఇంగ్లండ్​తో జరుగుతున్న టెస్టు సిరీస్ నుంచి భారత సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. కింగ్ దూరమవడంతో అభిమానుల కోరిక అలాగే ఉండిపోయింది.

  • Published Feb 10, 2024 | 3:50 PMUpdated Feb 10, 2024 | 3:50 PM
Virat Kohli: ఇంగ్లండ్​ సిరీస్ నుంచి కోహ్లీ ఔట్.. అభిమానుల కోరిక అలాగే ఉండిపోయింది!

విరాట్ కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఇంగ్లండ్​తో టెస్టు సిరీస్​లోని తొలి రెండు మ్యాచులకు దూరమైన ఈ సీనియర్ బ్యాటర్.. మిగిలిన మూడు టెస్టుల్లోనైనా బరిలోకి దిగుతాడని అంతా అనుకున్నారు. కానీ ఫ్యాన్స్​కు నిరాశ తప్పలేదు. సిరీస్​లోని మిగిలిన మ్యాచులకు కూడా కోహ్లీ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్ నుంచి విరాట్ తప్పుకున్నాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. కోహ్లీ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. చివరి మూడు టెస్టులకు టీమ్​ను ఇవాళ ప్రకటించింది బీసీసీఐ. అనుకున్నట్లుగానే కోహ్లీ సిరీస్ మొత్తానికి దూరమవగా.. ఇంజ్యురీ వల్ల రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే కోహ్లీ కమ్​బ్యాక్ ఇవ్వకపోవడంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు. తమ కోరిక నెరవేరకుండానే ఉండిపోయిందని బాధపడుతున్నారు.

క్రికెట్​లో కొన్ని పోరాటాలకు సూపర్ క్రేజ్ ఉంటుంది. కొన్ని టీమ్స్ తలపడుతున్నాయన్నా.. కొందరు ఆటగాళ్లు ఢీకొంటున్నారన్నా చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అయిపోతారు. అలాంటి అరుదైన ఫైట్లలో ఒకటి జేమ్స్ అండర్సన్-విరాట్ కోహ్లీది. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ అయిన అండర్సన్​కు భారత స్టార్ బ్యాటర్ కోహ్లీకి మధ్య చాన్నాళ్లుగా శత్రుత్వం ఉంది. అయితే ఇది గ్రౌండ్​కు మాత్రమే పరిమితమైన శత్రుత్వం. వ్యక్తిగతంగా ఇద్దరూ ఒకరితో ఒకరు బాగానే ఉంటారు. కానీ మైదానంలో ఎదురుపడితే మాత్రం కొదమసింహాల్లా పోట్లాడతారు. టెస్టు క్రికెట్​లో కోహ్లీ, అండర్సన్ గతంలో చాలాసార్లు పోటీపడ్డారు. అందులో 7 సార్లు విరాట్​ను జిమ్మీ ఔట్ చేశాడు. అండర్సన్ బౌలింగ్​లో మొత్తంగా 710 బంతులు ఎదుర్కొన్న కింగ్ 43.6 యావరేజ్​తో 305 పరుగులు చేశాడు.

The fans wish remained the same!

కోహ్లీని ఔట్ చేయాలని అండర్సన్, జిమ్మీ బౌలింగ్​ను ఉతికి ఆరేయాలని విరాట్ ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. వీళ్లిద్దరూ ఎదుర్కొన్న మ్యాచుల్లో కొన్నిసార్లు టీమిండియా బ్యాటర్​ది ఆధిపత్యం కాగా.. మరికొన్ని సార్లు అండర్సన్ డామినేషన్ నడిచింది. ఈసారి భారత పర్యటనలో 5 టెస్టులు ఆడేందుకు ఇంగ్లీష్ టీమ్ వచ్చింది. దీంతో వీళ్ల మధ్య మరోమారు ఆసక్తికర పోరు నడుస్తుందని అంతా అనుకున్నారు. కానీ తొలి రెండు మ్యాచుల్లో కోహ్లీ ఆడకపోవడంతో ఫ్యాన్స్​కు నిరాశే మిగిలింది. తాజాగా చివరి మూడు టెస్టుల నుంచి అతడు తప్పుకోవడంతో కోహ్లీ-అండర్సన్ వార్ చూసే ఛాన్స్ మిస్సయింది. అందుకే అభిమానులు తమ కోరిక అలాగే ఉండిపోయిందని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మోడర్న్ క్రికెట్​లో గ్రేటెస్ట్ బ్యాటిల్ ముగిసిపోయిందని చెబుతున్నారు. మరి.. కోహ్లీ-అండర్సన్ వార్ మిస్సవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Akash Deep: తండ్రి, సోదరుడి మరణం.. ఎన్నో కష్టాలు.. కట్ చేస్తే టీమిండియాలోకి! ఎవరీ ఆకాష్ దీప్?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి