iDreamPost
android-app
ios-app

IND vs ENG: వీడియో: జడేజాకు రోహిత్ వార్నింగ్! ఇక్కడ అది కుదరదంటూ..

  • Published Feb 17, 2024 | 10:19 AM Updated Updated Feb 17, 2024 | 4:10 PM

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజాకు కెప్టెన్ రోహిత్ శర్మ వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ అలా చేస్తే మాత్రం కుదరదన్నాడు.

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజాకు కెప్టెన్ రోహిత్ శర్మ వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ అలా చేస్తే మాత్రం కుదరదన్నాడు.

  • Published Feb 17, 2024 | 10:19 AMUpdated Feb 17, 2024 | 4:10 PM
IND vs ENG: వీడియో: జడేజాకు రోహిత్ వార్నింగ్! ఇక్కడ అది కుదరదంటూ..

భారత్-ఇంగ్లండ్​ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్​లో భారత్ 445 పరుగుల భారీ స్కోరుకు ఆలౌట్ అయింది. హిట్​మ్యాన్ (131)తో పాటు స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా (112) కూడా సెంచరీతో చెలరేగాడు. అరంగేట్ర ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్ (62), ధృవ్ జురెల్ (46) ఆకట్టుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ రెండో రోజు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఆ టీమ్ బజ్​బాల్​ ఫార్ములాతో దూకుడుగా ఆడుతోంది. బెన్ డకెట్ (133 నాటౌట్) మెరుపు శతకంతో విజృంభించాడు. మ్యాచ్​పై పట్టు సాధించాలంటే ప్రత్యర్థి జట్టును భారత్ త్వరగా ఆలౌట్ చేయాలి. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్​ టైమ్​లో జడేజాకు రోహిత్ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

భారత్ కంటే మరింత భారీ స్కోరు చేయాలనుకున్న ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్​లో చెలరేగుతోంది. ముఖ్యంగా డకెట్ ధనాధన్ షాట్లు ఆడుతూ టీమిండియా బౌలర్లను భయపెడుతున్నాడు. అతడు ఏకంగా 21 ఫోర్లు, 2 భారీ సిక్సులు కొట్టాడు. ఒకవైపు డకెట్ చెలరేగుతుండటం, మరోవైపు భారత బౌలర్లు ఓ ప్లాన్ లేకుండా ఇష్టం వచ్చినట్లు బౌలింగ్ చేయడంతో రన్స్ బాగా లీక్ అయ్యాయి. స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్తుండటం, వికెట్ పడకపోవడంతో సారథి రోహిత్ ఫ్రస్టేషన్​కు గురయ్యాడు. అలాంటి టైమ్​లో జడేజా పదే పదే నో బాల్స్ వేశాడు. దీంతో అతడిపై హిట్​మ్యాన్ సీరియస్ అయ్యాడు. నో బాల్స్ వేస్తే ఇక్కడ కుదరదన్నాడు. ‘జడ్డూ.. ఇది టీ20 మ్యాచ్​ అనుకో. ఇక్కడ నో బాల్స్ వేయడం కుదరదు’ అని రోహిత్ గట్టిగా అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Rohit's warning to Jadeja!

టెస్టు మ్యాచ్ అనుకొని బౌలింగ్ చేస్తే నో బాల్స్ పోతున్నాయని.. కాబట్టి దీన్ని టీ20 మ్యాచ్​గా భావించమంటూ జడేజాకు రోహిత్ సూచించాడు. దీంతో జడ్డూ మళ్లీ తన రనప్​ను సెట్ చేసుకొని బౌలింగ్ చేశాడు. ఆట రెండో రోజు జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. మూడో టెస్టులో భారత్ బాగానే బ్యాటింగ్ చేసినా.. బౌలింగ్​లో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యిందని అంటున్నారు. ఫీల్డ్ ప్లేస్​మెంట్స్, బౌలింగ్​ ఛేంజెస్ సరిగ్గా లేవని.. ఎలాంటి ప్లానింగ్ లేకుండానే బౌలర్లు బంతులు సంధించారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కనీసం మూడో రోజైనా పక్కా ప్లానింగ్​తో బౌలింగ్​ చేయాలని.. లేకపోతే ఇంగ్లండ్ మ్యాచ్​ను లాగేసుకోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. మరి.. జడేజాకు రోహిత్ వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs ENG: మూడో టెస్టు నుంచి అశ్విన్ ఔట్.. టెన్షన్​లో టీమిండియా! స్టోక్స్ ఒప్పుకుంటే..

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişJojobetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbet