iDreamPost

IND vs ENG: మూడో టెస్టు నుంచి అశ్విన్ ఔట్.. టెన్షన్​లో టీమిండియా! స్టోక్స్ ఒప్పుకుంటే..

  • Published Feb 17, 2024 | 8:43 AMUpdated Feb 17, 2024 | 8:43 AM

రాజ్​కోట్​ టెస్టులో భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్ నుంచి అనూహ్యంగా వైదొలిగాడు.

రాజ్​కోట్​ టెస్టులో భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్ నుంచి అనూహ్యంగా వైదొలిగాడు.

  • Published Feb 17, 2024 | 8:43 AMUpdated Feb 17, 2024 | 8:43 AM
IND vs ENG: మూడో టెస్టు నుంచి అశ్విన్ ఔట్.. టెన్షన్​లో టీమిండియా! స్టోక్స్ ఒప్పుకుంటే..

రాజ్​కోట్ వేదికగా ఇంగ్లండ్​తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఫ్యామిలీలో తలెత్తిన మెడికల్ ఎమర్జెన్సీ వల్ల అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెకు దగ్గర ఉండాలనే ఉద్దేశంతో అశ్విన్ హఠాత్తుగా చెన్నైకి పయనమయ్యాడని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఈ కష్ట కాలంలో అశ్విన్​కు బోర్డు, టీమ్ మేనేజ్​మెంట్ అండగా ఉంటాయని.. అతడికి కావాల్సిన సాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు. అశ్విన్ వైదొలగడంతో మూడో టెస్టులో భారత్ 4 బౌలర్లతోనే ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తీసుకునే డెసిషన్ మీద ఆధారపడాల్సి ఉంటుంది.

అశ్విన్ వెళ్లిపోవడంతో ఇప్పుడు భారత జట్టులో నలుగురు బౌలర్లే మిగిలారు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్​తో పాటు పేసర్లు మహ్మద్ సిరాజ్, జస్​ప్రీత్ బుమ్రా టీమ్​లో ఉన్నారు. అయితే ఐదో బౌలర్ లేకుండా కొనసాగడం చాలా కష్టం. ఉన్న నలుగురు బౌలర్లతో అన్ని ఓవర్లు పూర్తి చేయించడం అంత ఈజీ కాదు. ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడం వల్ల అలసిపోవడమే గాక గాయాల బారిన పడే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐదో బౌలర్​ను జట్టులోకి తీసుకోవాలని టీమ్ మేనేజ్​మెంట్ భావిస్తోంది. అయితే రూల్స్ ప్రకారం దీనికి ఇంగ్లండ్ సారథి స్టోక్స్ ఒప్పుకోవాలి. అశ్విన్ ప్లేసులో ఇంకో ప్లేయర్​ను తీసుకునేందుకు స్టోక్స్ ఓకే అంటే భారత్ కష్టాలు తీరుతాయి. దీంతో ఇప్పుడు అంతా ఇంగ్లీష్ టీమ్ చేతుల్లో ఉంది. ఆ టీమ్ మేనేజ్​మెంట్, స్టోక్స్ తీసుకునే నిర్ణయం మీదే మ్యాచ్​ ఎలా ముందుకు వెళ్తుందనేది ఆధారపడి ఉంది.

ఒకవేళ స్టోక్స్ ఒప్పుకుంటే అశ్విన్​కు బదులుగా భారత టీమ్​లోకి ఎవర్ని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇద్దరు ప్లేయర్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్​లోని తొలి రెండు మ్యాచుల్లో ఆడిన అక్షర్ పటేల్​తో పాటు వాషింగ్టన్ సుందర్​ రీప్లేస్​మెంట్​కు రెడీగా ఉన్నారు. అయితే వీరిలో ఒక్కరు మాత్రమే టీమ్​లోకి వస్తారు. మొదటి రెండు మ్యాచుల్లో ఆడటం, టెస్టుల్లో మంచి అనుభవం ఉండటం, ఫామ్​లో కూడా ఉండటంతో అక్షర్​ వైపు టీమ్ మేనేజ్​మెంట్ మొగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇదంతా స్టోక్స్ ఒప్పుకుంటేనే జరుగుతుంది. భారత రిక్వెస్ట్​ను అతడు తిరస్కరిస్తే ఉన్న నలుగురు బౌలర్లతోనే కంటిన్యూ కావాల్సి ఉంటుంది. రీప్లేస్​మెంట్​కు ఒప్పుకోకపోయినా సబ్​స్టిట్యూట్​గా ఒక ప్లేయర్​ను టీమ్​లోకి తీసుకోవచ్చు. అయితే సబ్​స్టిట్యూట్​ ఆటగాడు కేవలం ఫీల్డింగ్​కే పరిమితం అవుతాడు. మరి.. అశ్విన్ రీప్లేస్​మెంట్​కు స్టోక్స్ ఒప్పుకుంటాడని మీరు భావిస్తున్నట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Yuvraj Singh: యువరాజ్‌ సింగ్‌ ఇంట్లో దొంగతనం.. భారీగా క్యాష్‌, నగలు చోరీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి