iDreamPost

చివరి టెస్టులో ఇంగ్లండ్‌ చిత్తు! టీమిండియా విజయానికి 5 ప్రధాన కారణాలు

  • Published Mar 09, 2024 | 2:37 PMUpdated Mar 09, 2024 | 2:50 PM

ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్​ను ఇన్నింగ్స్​ 64 పరుగుల తేడాతో చిత్తు చేసింది భారత్. ఈ మ్యాచ్​లో రోహిత్ సేన ఘనవిజయం సాధించడానికి గల 5 కారణాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్​ను ఇన్నింగ్స్​ 64 పరుగుల తేడాతో చిత్తు చేసింది భారత్. ఈ మ్యాచ్​లో రోహిత్ సేన ఘనవిజయం సాధించడానికి గల 5 కారణాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 09, 2024 | 2:37 PMUpdated Mar 09, 2024 | 2:50 PM
చివరి టెస్టులో ఇంగ్లండ్‌ చిత్తు! టీమిండియా విజయానికి 5 ప్రధాన కారణాలు

అనుకున్నదే జరిగింది. మొదటి రోజు నుంచి ఫుల్ డామినేషన్ చూపించిన భారత్.. రెండో రోజు దాన్ని కొనసాగించి, మూడో రోజు మధ్యాహ్నానికే ఆటను ముగించింది. భారత పర్యటనలో ఇంగ్లండ్​ జట్టుకు మరో ఘోర పరాభవం ఎదురైంది. ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఆ టీమ్ ఏకంగా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కనీసం ఫైట్​బ్యాక్ అనేది లేకుండా రోహిత్ సేన ముందు తలొగ్గింది. మ్యాచ్​లో ఏ దశలోనూ ఆ టీమ్​ పోరాడలేదు. మూడో రోజు భారత్​ను 477 పరుగులకు కట్టడి చేసిన ఇంగ్లీష్ టీమ్.. సెకండ్ ఇన్నింగ్స్​లో 195 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో ఇన్నింగ్స్ తేడాతో పరాభవం తప్పలేదు. ఈ విక్టరీతో సిరీస్​ను 4-1తో సొంతం చేసుకుంది భారత్. ఈ నేపథ్యంలో ఐదో టెస్టులో మన టీమ్ విజయానికి గల 5 ప్రధాన కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

1. స్పిన్‌ బౌలింగ్‌
ధర్మశాల టెస్టులో టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్​ చెలరేగిపోయారు. మొదటి ఇన్నింగ్స్​లో వీళ్లిద్దరూ కలసి 9 వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్​లోనూ ఈ జోడీ 7 వికెట్లు తీసింది. రవీంద్ర జడేజా కూడా 2 కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి పతనంలో తనదైన పాత్ర పోషించాడు. స్పిన్నర్లు విజృంభించడం, ఒక్క బ్యాటర్​ను కూడా క్రీజులో కుదురుకోకుండా చేయడం, రెండు ఇన్నింగ్స్​ల్లోనూ తక్కువ స్కోర్లకే ఆలౌట్ చేయడం వల్లే భారత్​ సునాయాసంగా నెగ్గింది.

2. బ్యాటింగ్
ఐదో టెస్టులో భారత్ ఒకేసారి బ్యాటింగ్​కు దిగింది. బౌలర్లు విజృంభించడం, బ్యాటర్లు కూడా సూపర్బ్​గా రాణించడంతో ఇంకోసారి బ్యాట్ పట్టాల్సిన అవసరం రాలేదు. తొలి ఇన్నింగ్స్​లో టీమిండియా 477 పరుగులు చేసిందంటే దానికి కెప్టెన్​ రోహిత్ శర్మ (103), శుబ్​మన్ గిల్ (110) బాదిన సెంచరీలే కారణం. అయితే వీరితో పాటు యశస్వి జైస్వాల్ (57), దేవ్​దత్ పడిక్కల్ (65), సర్ఫరాజ్ ఖాన్ (56) ఇన్నింగ్స్​ను కూడా తక్కువ చేయడానికి లేదు. రోహిత్-గిల్​ తర్వాత పడిక్కల్-సర్ఫరాజ్​ పార్ట్​నర్​షిప్ మ్యాచ్​లో డిసైడింగ్ ఫ్యాక్టర్​గా చెప్పొచ్చు.

3. రోహిత్‌-గిల్‌ సెంచరీలు
నిల్చుంటే పరుగులు వచ్చే పిచ్ మీద అనవసర అటాక్​కు వెళ్లి ఇంగ్లండ్​ తొలి ఇన్నింగ్స్​లో 218 పరుగులకే కుప్పకూలింది. ఇందులో కుల్దీప్, అశ్విన్ స్పిన్ మ్యాజిక్​ను తక్కువ చేయడానికి లేదు. అదే టైమ్​లో రోహిత్-గిల్ సెంచరీల గురించి మాట్లాడుకోవాలి. ధర్మశాల పిచ్​పై పరుగులు ఈజీగా వస్తాయని వీళ్లు ప్రూవ్ చేశారు. వీళ్లు ఎప్పుడైతే సెంచరీలు చేశారో అప్పుడే భారత్ డ్రైవింగ్ సీట్​లోకి వచ్చేసింది. ఇంగ్లండ్​ ఆటగాళ్ల ముఖాలు వాడిపోయాయి. ఓటమి భయం అప్పుడే పట్టేసుకుంది. కాబట్టి మ్యాచ్ గెలుపులో రోహిత్-గిల్ పార్ట్​నర్​షిప్, సెంచరీలు ప్రధాన కారణమని చెప్పొచ్చు.

4. కుల్దీప్-అశ్విన్ జోడీ
బ్యాటింగ్​లో రోహిత్-గిల్ జోడీలాగే బౌలింగ్​లో కుల్దీప్-అశ్విన్ మ్యాజిక్ చేశారు. వీళ్లిద్దరూ రెండు ఇన్నింగ్స్​ల్లో కలిపి తీసిన వికెట్లు 16. మొత్తం 20 వికెట్లలో వీళ్లే 90 శాతానికి పైగా పడగొట్టేశారు. ఒక ఎండ్ నుంచి అశ్విన్, మరో ఎండ్ నుంచి కుల్దీప్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుంటే పరుగులు రాక, వికెట్లు పడుతుంటే ఇంగ్లండ్​ క్యాంపెయిన్ షాకైంది. ఇదేం బౌలింగ్ అంటూ ఆశ్చర్యపోయింది. ఐదో టెస్టు సక్సెస్​లో ఈ ఇద్దరు స్పిన్ మాంత్రికులకు ఎక్కువ శాతం క్రెడిట్ ఇవ్వాలి.

5. బెన్ స్టోక్స్ తప్పుడు నిర్ణయం
ధర్మశాల టెస్టులో టాస్ నెగ్గిన సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఓ తప్పు చేశాడు. అతడు బ్యాటింగ్​ ఎంచుకున్నాడు. అదే ఆ జట్టుకు శాపంగా మారింది. ఇంగ్లీష్ టీమ్ 218 పరుగులకే కుప్పకూలడం, ఆ తర్వాత భారత్ 477 పరుగులు చేయడం తెలిసిందే. పిచ్​ నుంచి స్పిన్​కు మద్దతు ఉందని గ్రహించి మొదట ఫీల్డింగ్​ ఎంచుకుంటే బాగుండేది. కానీ అతడు బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అది రోహిత్ సేనకు కలిసొచ్చింది. మరి.. ధర్మశాల టెస్టులో టీమిండియా విజయానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని భావిస్తే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: వీడియో: కుర్రాళ్లను గెలికిన బెయిర్‌ స్టో! ఒక్క మాటతో పరువుతీసిన గిల్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి