iDreamPost

పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా

  • Author Soma Sekhar Published - 09:38 PM, Sat - 2 September 23
  • Author Soma Sekhar Published - 09:38 PM, Sat - 2 September 23
పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా

టీమిండియా-పాకిస్థాన్ మధ్య పోరంటే.. ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తాయి. ఇక దాయాది దేశాలు తలపడుతుంటే.. ఓ చిన్నపాటి యుద్ధాన్ని చూస్తున్నట్లుగానే ఉంటుంది ప్రేక్షకులకు. ప్రస్తుతం ఆసియా కప్ 2023లో భాగంగా టీమిండియా-పాకిస్థాన్ జట్లు తలపడుతుండగా.. భారత్ 266 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక మరోవైపు ఏషియన్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీ విజేతగా టీమిండియా నిలిచింది. ఫైనల్లో పాకిస్థాన్ పై 6-4 గోల్స్ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.

పాకిస్థాన్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఏషియన్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నీ విజేతగా భారత్ నిలిచింది. తాజాగా పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా ఆడింది టీమిండియా హాకీ జట్టు. ప్రత్యర్థి గోల్ పోస్ట్ పై దాడి చేస్తూ.. ముప్పు తిప్పలు పెట్టింది. అయితే సమయం ముగిసే సరికి ఇరు జట్లు 4-4 గోల్స్ తో మ్యాచ్ ను డ్రాగా ముగించాయి. కాగా.. పెనాల్టీ షూటౌట్ లో భారత్ 2 గోల్స్ చేసి టోర్నీ విజేతగా నిలిచింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి