iDreamPost

రియాలిటీ షో మీద ఎన్నో ఆశలు

రియాలిటీ షో మీద ఎన్నో ఆశలు

జెమినీ ఛానల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆర్ఆర్ఆర్ బ్యాలన్స్ షూట్ ఇంకా మొదలు కాకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దీన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. హిందీలో బ్లాక్ బస్టర్ క్విజ్ షోగా పేరు తెచ్చుకున్న కౌన్ బనేగా కరోడ్ పతికి తెలుగు రూపకమైన ఈ షో గతంలో స్టార్ మాలో నాగార్జున,చిరంజీవి హోస్టులుగా నడిపిన సంగతి తెలిసిందే. అయితే క్రమంగా దీనికి ఆదరణ తగ్గడంతో పాటు ఇతరత్రా కారణాల వల్ల దీన్ని ఆపేశారు. ఇప్పుడు జెమిని కొత్త ప్రణాళికతో టైటిల్ ని కొద్దిగా రివర్స్ లో మార్చి డిఫరెంట్ స్ట్రాటజీతో రీ స్టార్ట్ చేయబోతోంది. అంచనాలు కూడా బాగానే ఉన్నాయి.

ఇప్పుడీ కోటీశ్వరుడి ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ముందుగా టిఆర్పి రేటింగ్స్. జెమినికి ఇటీవలి కాలంలో స్టార్ మా, జీ తెలుగు నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. సీరియల్స్ లో ఈటీవీ సైతం దూసుకుపోతోంది. మరోవైపు టాప్ కామెడీ షోస్ జబర్దస్త్ లాంటివి జెమిని డిజైన్ చేయలేకపోతోంది. అందుకే ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరుడు రూపంలో గట్టి ప్లాన్ తో సిద్ధమవుతోంది. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ ని తారక్ నడిపించిన తీరు దాని పాపులారిటీలో కీలక పాత్ర పోషించింది. ఆ అంచనాలు నాని సైతం రెండో సీజన్ లో అందుకోలేకపోయాడు. ఎమోషన్లను బాగా రప్పించే తారక్ తో కోటీశ్వరుడు బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఫ్యాన్స్ లోనూ ఉంది.

ఇక్కడే ఒక ట్విస్టు కూడా ఉంది. ఇటీవలి కాలంలో ఇలాంటి క్విజ్ షోల పట్ల జనం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పైగా చిరంజీవి అంతటి స్టార్ చేసినా కూడా అప్పట్లో వర్కౌట్ కాలేదు. మరి ఈసారి ఫార్మాట్ కూడా మార్చారని అంటున్నారు. ఈ షో మొదటి సీజన్ వచ్చిన సమయానికి ఇప్పటికీ ప్రేక్షకుల అభిరుచుల్లో చాలా మార్పులు వచ్చాయి. మరి వాటికి తగ్గట్టు రౌండ్లు ఎలా మార్చారో చూడాలి. మరొక విషయం ఏంటంటే జూనియర్ ని అరవింద సమేత వీర రాఘవ తర్వాత తెరమీద చూసి 1000 రోజులు దాటేసింది. ఇది కూడా ఇప్పుడు ఈ షో పెద్ద ప్లస్ కానుంది. మరి ఈ సవాళ్ళన్నీ కోటీశ్వరుడు ఎలా దాటుతాడో చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి