iDreamPost

ఒకరితో ప్రేమ, మరొకరితో పెళ్లి ..! చివరలో ట్విస్ట్ మాములుగా లేదు!

ఒకరితో ప్రేమ, మరొకరితో పెళ్లి ..! చివరలో ట్విస్ట్ మాములుగా లేదు!

పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు శిరీష. గత 6 ఏళ్ల నుంచి ఓ యువకుడితో ప్రేమలో ఉంది. ఇదే విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో మరొక యువకుడికి వివాహం జరిపించారు. అలా కొంత కాలం పాటు భర్తతోనే ఉంది. కానీ, శిరీష మనసంతా ప్రియుడి మీదే ఉంది.ఇక ఎలాగైన భర్తను వదిలి ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. మొదట్లో ప్రియుడు కూడా ఓకే అన్నాడు. కట్ చేస్తూ ప్రియుడు ఊహించని షాక్ ఇవ్వడంతో శిరీషకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. అసలేం జరిగిందంటే?

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట గ్రామానికి చెందిన శిరీష, ఆమనగల్లుకు చెందిన మహేష్ ఇద్దరూ గత 6 ఏళ్లుగా ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. అయితే ఇదే విషయం ఈ యువతి తల్లిదండ్రులకు తెలిసింది. మా పరువు పోతుందని భావించి 5 ఏళ్ల కిందటే శిరీషకు మరో యువకుడితో వివాహం జరిపించారు. కాగా, పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కుమారుడు కూడా జన్మించినట్లు సమాచారం. మరో విషయం ఏంటంటే? శిరీష అప్పటి నుంచి ప్రియుడు మహేష్ తో టచ్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

ఎలాగైన భర్తకు దూరం జరిగి ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇదే విషయాన్ని ప్రియుడికి చెప్పడంతో మొదట్లో అతడు కూడా సరే అన్నాడు. అనుకున్నట్లుగానే ఆ యువతి గత కొన్నిరోజుల నుంచి భర్తకు దూరంగా ఉంటుంది. ఇక పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరింది. కానీ, ఉన్నట్టుండి అతడు ప్లేట్ ఫిరాయించాడు. దీంతో ఆ యువతికి ఏం చేయలో అర్థం కాక నెత్తి, నోరు బాదకుంది. ఇదే విషయమై గ్రామ పెద్దలకు వివరించి న్యాయం చేయాలని కోరినా ఎలాంటి ఫలితం దక్కలేదు. దీంతో ఆ యువతి చేసేదేం లేక ప్రియుడు మహేష్ ఇంటి ముందు ధర్నాకు దిగి నాకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి