iDreamPost

టీమిండియా ఆటగాడికి యాక్సిడెంట్! నుజ్జునుజ్జైన కారు..

టీమిండియా ఆటగాడికి యాక్సిడెంట్! నుజ్జునుజ్జైన కారు..

గత కొంతకాలంగా టీమిండియా క్రికెటర్లు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. గతేడాది టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురై.. తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే అతడు కోలుకుంటున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఆటగాడు యాక్సిడెంట్ కు గురైయాడు. తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ప్రమాదం సంభవించినప్పుడు కారులో మాజీ క్రికెటర్ తో పాటుగా అతడి కొడుకు కూడా ఉన్నాడు. వారు ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..

టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ కొద్దిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ లోని పాండవ్ నగర్ నుంచి రాత్రి 10 గంటలకు మీరట్ కు వస్తున్నాడు. కారులో ప్రవీణ్ కుమార్ తో పాటుగా అతడి కుమారుడు కూడా ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారును వేగంగా వస్తున్న క్యాంటర్ వాహనం బలంగా ఢీకొట్టింది. దాంతో అతడు ప్రయాణిస్తున్న ల్యాండ్ రోవర్ కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది.

Major accident to team india cricketer praveen

ఈ ప్రమాదంలో ఇద్దరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్యాంటర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రవీణ్ కుమార్ 2007-2012 మధ్య టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. తన స్వింగ్ బౌలింగ్ తో కొద్దికాలంలోనే టీమిండియాకు ఎంపికైయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 68 వన్డేలు, 10 టీ20లు, 6 టెస్ట్ మ్యాచ్ లకు టీమిండియా తరపున ప్రాతినిధ్యం వహించాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి