iDreamPost

జగన్…ఆశయం కోసం వేటాడే పులి: రోజా

జగన్…ఆశయం కోసం వేటాడే పులి: రోజా

ప్లీన‌రీలో నేత‌ల ప్ర‌సంగాల‌కు అపూర్వంగా స్పంద‌న వ‌స్తోంది. ఇక‌ మంత్రి రోజా ప్రసంగం, హాజ‌రైన‌వారిని ఉర్రూతలూగించింది.

ఆవేశంతో వేటాడే పులిని చూసి ఉంటారు, ఆకలితో వేటాడే పులిని చూసిఉంటారు, అధికారం కోసం వేటాడే పులిని మీరు చూసి ఉంటారు. కానీ, ఆశయం కోసం పోరాడే పులి, ఈ పులివెందుల బిడ్డ జగనన్న అంటూ ఆమె అన‌డంతో హర్షధ్వానాలు, జై జ‌గ‌న్ నినాదాలు మిన్నంటాయి.

ఆమె ప్ర‌తిమాట ప్లీన‌రీకి హుషారిచ్చింది. దేశాన్నే గడగడలాడించిన సోనియా గాంధీని, గడగడలాడించిన మహానాయకుడు, వెన్నుపోటు చంద్రబాబునాయుడు వెన్నులో వణుకు పుట్టించిన నాయకుడు, మన జగనన్న అంటూ ఆమె వ‌ర్ణించారు.

సాధారణంగా అమ్మను మించిన దైవం లేదని అందరూ అంటార‌రు. ఈ రాష్ట్రంలోని మహిళలందరూ ఇవాళ జగనన్నను మించిన ధైర్యం లేదని అనుకుంటున్నారని ఆమె అన్నారు. మహిళల రక్షణకు ఎలా పెద్దపీట వేశారో రోజా చెప్పారు

మూడేళ్ల క్రితం రాఖీ పండగ నాడు, జగనన్నకు తాను బంగారు రాఖీ కట్టి ఒక‌టి కోరుకున్నాను. అన్న ముఖ్యమంత్రి అయి, రాష్ట్రంలోని మహిళలకు బంగారు భవిష్యత్తు అందించాలన్న‌ తన ప్రార్థనను దేవుడు విన్నాడు, అన్నను ముఖ్యమంత్రిని చేశాడని, అంద‌రూ కోరుకున్న‌ట్లుగానే మహిళలకు బంగారు భవిష్యత్తు అందివచ్చిందని రోజా అన్నారు.

వెన్ను చూపకుండా పోరాడే దమ్మున్న నాయకుడు వైఎస్‌ జగన్‌. వైఎస్సార్‌సీపీ జెండా ఎప్పుడూ ఎగురుతూనే ఉంటుంది. అని మంత్రి రోజా ప్ర‌క‌టించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి