iDreamPost

Acharya : అంచనాలు పెంచేసిన ఆచార్య మెగా ఫ్రేమ్

Acharya : అంచనాలు పెంచేసిన ఆచార్య మెగా ఫ్రేమ్

నిన్న విడుదలైన ఆచార్య సిద్దా సాగా టీజర్ సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన పరిచయమే అయినప్పటికీ వీడియోలోని చివరి షాట్ లో నీటికుంట దగ్గర ఒకవైపు చిరుతలు మరోవైపు చిరంజీవి చరణ్ లను చూపిస్తూ కట్ చేసిన సన్నివేశం మెగా ఫ్యాన్స్ లోనే కాదు మూవీ లవర్స్ లోనూ ఓ రేంజ్ లో అంచనాలు పెంచేసింది. గతంలో ఈ ఇద్దరూ మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నెంబర్ 150లో కలిసి చేసినప్పటికీ ఆచార్య మాత్రం ది బెస్ట్ అనిపించే రేంజ్ లో వస్తుందనే నమ్మకాన్ని కేవలం ఒక్క సీన్ ద్వారా దర్శకుడు కొరటాల శివ కలిగించడం విశేషం. అటుఇటుగా ఉన్న అంచనాలు ఇప్పుడు అమాంతం పెరిగిపోయాయి.

నిజానికి ఆచార్య విషయంలో జరుగుతున్న ప్రమోషన్ పట్ల అభిమానులు ఏమంత సంతోషంగా లేరు. ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, పుష్ప తరహా హడావిడి దీనికి లేదని, పైగా నీలాంబరి పాట ఆశించిన కిక్ ఇవ్వలేదని ఇలా రకరకాలుగా వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడీ టీజర్ వచ్చాక వాళ్ళ కొరత దాదాపుగా తీరినట్టే అని చెప్పొచ్చు. ఇంకా ట్రైలర్ ఉంటుంది కాబట్టి అందులో అసలైన కంటెంట్ ని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. 2022 ఫిబ్రవరి 4న విడుదల కాబోతున్న ఆచార్య పబ్లిసిటీని సంక్రాంతి తర్వాత వేగం పెంచబోతున్నారు. ఆర్ఆర్ఆర్ కూడా చరణ్ మూవీనే కాబట్టి దాని వేడి చల్లారాక దీని హైప్ ని పెంచుతారు. దానికి తగ్గట్టే ప్రణాళిక ఉంది.

ఇప్పటిదాకా ఆచార్య నుంచి వచ్చింది రెండు పాటలే. ఇంకా మూడు బాలన్స్ ఉన్నాయి. రెజీనాతో చేసిన ఐటెం సాంగ్ ని చివరిలో వదిలే అవకాశం ఉంది. మణిశర్మ అసలైన మాస్ అందులో ఉంటుందని ఇప్పటికే టాక్ ఉంది. మొత్తానికి ఒక సినిమాకు బజ్ ని పెంచడంలో కొన్నిసార్లు చిన్న వీడియో బిట్ లేదా ఒక పాట ఏ స్థాయిలో మేజిక్ చేస్తాయో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు. చరణ్ సినిమా మొత్తం ఉండకపోయినా కీలకమైన నలభై నిమిషాల ఎపిసోడ్ లో కొరటాల శివ గట్టిగానే చూపించారట. కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సోనూ సూద్ విలన్ గా చేస్తున్నారు.

Also Read : Bimbisara : బాహుబలి రేంజ్ లో నందమూరి హీరో పాత్ర

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి