iDreamPost

దుబ్బాక పోరు: ఆరో రౌండ్‌లో దూకెళ్లిన కారు

దుబ్బాక పోరు: ఆరో రౌండ్‌లో దూకెళ్లిన కారు

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో మొదటి సారి టీఆర్‌ఎస్‌ ఆధిక్యం సంపాధించింది. ఆరు రౌండ్‌లో ఆ పార్టీ సోలిపేట సుజాత 353 ఓట్ల ఆధిక్యం సాధించారు. పోస్టల్‌ బ్యాలెట్లలో ఆధిక్యం సంపాధించిన టీఆర్‌ఎస్‌.. ఈవీఎం ఓట్ల లెక్కింపులో తొలిసారి ఆరో రౌండ్‌లో ఎక్కువ ఓట్లు పొందింది.

మొదటి ఐదు రౌండ్లలో ఆధిక్యం సంపాధించి.. 3,020 ఓట్ల ఆధిక్యంలో కొనసాగిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు.. ఆరో రౌండ్‌లో వెనుకబడ్డారు. దీంతో ఆయన ఆధిక్యం 2,667 ఓట్లకు పడిపోయింది. ఇంకా 17 రౌండ్లు ఓట్ల లెక్కింపు ఉంది.

ఆరో రౌండ్‌ ముగిసే సరికి బీజేపీ 20,226, టీఆర్‌ఎస్‌ 17,559, కాంగ్రెస్‌ 3,254 ఓట్లు పొందాయి. మొత్తం 23 రౌండ్లలో 1,64, 192 ఓట్లు లెక్కించాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి