iDreamPost

ఢిల్లీలో మరో దారుణం.. రూ.3 వేల కోసం దారుణ హత్య

ఢిల్లీలో మరో దారుణం.. రూ.3 వేల కోసం దారుణ హత్య

ఈ మధ్యకాలంలో కొందరు యువకులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. మాట్లాడుకుంటే సమిసిపోయే గొడవలకు కొంతమంది దారుణానికి పాల్పడుతున్నారు. ఇంతే కాకుండా చివరికి హత్యలకు కత్తులు నూరుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా ఢిల్లీలో చోటు చేసుకుంది. కేవలం రూ.3 వేల కోసం ఓ దుండగుడు మరో యువకుడిని దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని సంగం విహార్ ఏరియాలో యూసుఫ్ అలీ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతనికి షారుఖ్ అనే స్నేహితుడు ఉన్నాడు. అయితే, ఇటీవల యూసుఫ్ అలీకి డబ్బులు అవసరం వచ్చాయి. ఎంతో మందిని ఆశ్రయించాడు. కానీ, ఎవరు కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు. దీంతో యూసుఫ్ తన స్నేహితుడైన షారుఖ్ ను రూ.3 వేలు కావాలని అడిగాడు. దీనికి కాదనని ఆ యువకుడు సరేనంటూ రూ.3 వేలు ఇచ్చాడు. అలా కొన్ని రోజలు గడిచింది.

ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని షారుఖ్ యూసుఫ్ అలీని అడిగాడు. ఇప్పుడు లేవని, కొన్ని రోజులు తర్వాత ఇస్తానని సముదాయించి చెప్పాడు. ఇదే విషయంపై ఇద్దరు అనేక సార్లు గొడవ పడ్డారు. దీంతో షారుఖ్ తన స్నేహితుడైన యూసుఫ్ అలీపై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా అతడిని హత్య చేయాలని పథకం గీశాడు. ఇందులో భాగంగానే తాజాగా యూసుఫ్ అలీ తిగ్డి ప్రాంతంలో ఓ షాపు వద్ద నిలుచున్నాడు. అతడిని చూసి అప్రమత్తమైన షారుఖ్.. తన వెంట తెచ్చుకున్న కత్తితో యూసుఫ్ పై అనేక సార్లు పొడిచాడు.

ఇతని దాడిలో ఆ యువకుడు రక్తపు మడుగులో పడిపోయాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై షారుఖ్ ను అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే యూసుఫ్ అలీని స్జానిక ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడు షారుఖ్ ను అరెస్ట్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. రూ.3 వేల కోసం యువకుడిని చంపిన దుండగుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: నాలుగు రోజుల కిందటే సీమంతం.. ఇంతలోనే విషాదం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి