iDreamPost

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్!

  • Author Soma Sekhar Published - 10:58 AM, Mon - 18 September 23
  • Author Soma Sekhar Published - 10:58 AM, Mon - 18 September 23
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్!

దేశవ్యాప్తంగా ప్రజలందరూ అత్యంత భక్తి శ్రద్దలతో వినాయక చవితి పండుగను జరుపుకుంటున్నారు. ఊరూరా, వాడవాడలా పందిర్లు వేసి అత్యంత వైభవంగా వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. ఇక ఈ పండుగను పురస్కరించుకుని సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ట్విట్టర్ ద్వారా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

వినాయక చవితి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. “ఈ వినాయక చవితి పండుగ నాడు ఆ విఘ్నేశ్వరుడి శుభ దృష్టి మన రాష్ట్రంపై ఉండాలని, రాష్ట్ర ప్రజలందరికి క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలి. విఘ్నాలు అన్ని తొలగి రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆ భగవంతుడిని మనస్పూర్తిగా కోరుకుంటూ.. రాష్ట్ర ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు” అంటూ ట్విట్టర్ వేదిగా తన విషెస్ ను తెలియజేశారు సీఎం జగన్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి