iDreamPost

సడెన్ గా ఓటీటీలోకి వచ్చిన బెదురులంక-2012.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

  • Author Soma Sekhar Published - 09:05 AM, Fri - 22 September 23
  • Author Soma Sekhar Published - 09:05 AM, Fri - 22 September 23
సడెన్ గా ఓటీటీలోకి వచ్చిన బెదురులంక-2012.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

ప్రస్తుతం ఓటీటీ యుగంలో కొందరు మూవీ మేకర్స్ తీసుకుంటున్న నిర్ణయాలు వెరైటీగా ఉంటున్నాయి. కొన్ని సినిమాలు ఎప్పుడు? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయో ముందే ప్రకటిస్తుండగా.. మరికొన్ని చిత్రాలు మాత్రం సైలెంట్ గా ఓటీటీల్లో దర్శనం ఇస్తున్నాయి. అలాగే సైలెంట్ గా సడెన్ గా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది హీరో కార్తికేయ నటించిన బెదురులంక-2012 మూవీ. 2012 యుగాంతం నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ నటించిన చిత్రం ‘బెదురులంక-2012’. ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహించగా.. కార్తికేయకు జోడీగా నేహా శెట్టి నటించింది. 2012 యుగాంతం నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకొచ్చి మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి సడెన్ గా వచ్చింది. ఈ రోజునుంచే(సెప్టెంబర్ 22) ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఎల్బీ శ్రీరామ్, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషించగా.. మణిశర్మ సంగీతాన్ని సమాకూర్చారు.


వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి