iDreamPost

రాజధానిపై బీసీజీ నివేదిక

రాజధానిపై బీసీజీ నివేదిక

రాజధాని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై రూపొందించిన నివేదికను బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పించింది. ఈ రోజు సచివాలయంలో సీఎం జగన్‌ను కలసిన బీసీజీ ప్రతినిధులు నివేదికను అందించారు.

ఇప్పటికే రాజధాని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ తన నివేదికను రాష్ట్రప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఈ రెండు నివేదికలను పరిశీలించి ప్రభుత్వానికి మార్గదర్శనం చేసేందుకు ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

బీసీజీ, జీఎన్‌రావు కమిటీలు ఇచ్చిన రెండు నివేదికల అధ్యయనానికి ఈ నెల 6వ తేదీన హైపవర్‌ కమిటీ సమావేశం కానుంది. మూడు వారాల్లోగా హైపవర్‌ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది.

కాగా, ఈ నెల 8వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కాబోతోంది. ఎప్పట లాగే మంత్రివర్గం సాధారణంగానే సమావేశం కాబోతోంది. అయితే ఈసమావేశంలో బీసీజీ నివేదికపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి