iDreamPost

బ్రేకింగ్: కంపెనీ ఎండీ- సీఈవోని హత్య చేసిన మాజీ ఉద్యోగి!

బ్రేకింగ్: కంపెనీ ఎండీ- సీఈవోని హత్య చేసిన మాజీ ఉద్యోగి!

ప్రముఖ కంపెనీకి చెందిన మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. ఈ వార్తతో బెంగళూరులో భయాందోళన వాతావరణం నెలకొంది. పైగా హత్య చేసింది ఆ కంపెనీ మాజీ ఉద్యోగే అని పోలీసులు చెబుతుండటంతో.. మరింత భయపడుతున్నారు. ఈ జంట హత్యల వార్తతో బెంగళూరు మొత్తం హైటెన్షన్ నెలకొంది.

నార్త్ బెంగళూరులోని అమృతహల్లి పంపా ఎక్స్ టెన్షన్ ప్రాంతంలో ఈ హత్యలు జరిగాయి. మృతులు ఏరోనిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఫణీంద్ర సుబ్రమణ్య, సీఈవో అయిన వినుకుమార్ గా గుర్తించారు. ఈ కంపెనీ ఇంటర్నెట్ సేవలను అందిస్తుంటుందని చెబుతున్నారు. ఈ వార్త తెలియడంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈ హత్యలు చేసిన వ్యక్తి ఫెలిక్స్ గా గుర్తించారు. అతను గతంలో అదే కంపెనీలో పని చేసినట్లు పోలీలులు తెలిపారు. అతను గతంలో వీరి కంపెనీలో పని చేసి.. తర్వాత సొంత కంపెనీ పెట్టుకున్నాడని చెబుతున్నారు. ఫణీంద్ర సుబ్రమణ్య, విను కుమార్ తన బుజినెస్ కి అడ్డుగా ఉన్నారని భావించి హత్య చేసినట్లు భావిస్తున్నారు. మంగళవారం సాయంత్రం అతను కంపెనీకి వచ్చి వీరిపై దాడి చేశాడని చెబుతున్నారు. పదునైన వస్తువులతో వారిని పొడిచి చంపాడు. వారు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఫేలిక్స్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి