Idream media
Idream media
వివాహం జరిగిన వెంటనే తన కొడుకు విదేశాలకు వెళ్లాడని, అలాంటిది పిల్లాడు ఎలా పుట్టాడని ఓ అత్త కోడల్ని నిలదీసింది. పెళ్ళైన 20 రోజుల తర్వాత తన భర్త విదేశాలకు వెళ్లాడని, ఈ బిడ్డ తన బిడ్డేనని, కావాలంటే డిఎన్ఏ పరీక్ష చేయించండని కోడలు డిమాండ్ చేస్తోంది. సినిమా కథను తలపించే ఈ ఘటన తమిళనాడు లో చోటుచేసుకుంది.
తెన్కాశి సమీపంలోని కట్టే రిపట్టికి చెందిన మురుగన్కు అదే ప్రాంతానికి చెందిన తెన్మొళితో గత ఫిబ్రవరిలో వివాహం జరిగింది. వివాహం జరిగిన 20 రోజుల తరువాత మురుగన్ ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లాడు. భర్త విదేశాలకు వెళ్లడంతో తెన్ మొళి తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది.
ఈ నేపథ్యంలో మంళవారం ఉదయం తెన్ మొళి ఓ పసిబిడ్డతో వచ్చి మీ మనుమడు అని చెప్పడంతో మురుగన్ తల్లిదండ్రులు అవాక్కయ్యారు. వివాహం అయి 9 నెలలు గడిచింది వాస్తవమేనని, తమ కుమారుడు అప్పుడే విదేశాలకు వెళ్లగా పసిబిడ్డ ఎలా జన్మించాడని అత్తామామలు తెన్మొళి నిలదీశారు. ఇంట్లోకి వచ్చేందుకు అనుమతించలేదు. దీంతో మనస్తాపం చెందిన తెన్మొళి ఇంటి ముందు నిరసనకు దిగింది. భర్తను పిలిపించి డీఎన్ఏ పరీక్షలు చేయించాలని డిమాండ్ చేస్తోంది. అప్పటివరకు తనను ఇంట్లో ఉండనివ్వాలంటూ పసిబిడ్డతో కలసి ఇంటి ముందు భైఠాయించింది.