iDreamPost

అప్పికొండ బీచ్ యువతి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! అసలేం జరిగిందంటే?

అప్పికొండ బీచ్ యువతి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! అసలేం జరిగిందంటే?

విశాఖలోని అప్పికొండ బీచ్ లో ఓ యువతి గాయాలపాలై కనిపించిన విషయం తెలిసిందే. స్థానికులు అప్రమత్తమై వెంటనే ఆ యవతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులు ఈ ఘటనపై స్పందించి ఆ అమ్మాయిని విచారించారు. అయితే ఈ కేసులో వీళ్లిద్దరు ప్రేమికులని, ఇటీవల ఇంట్లో నుంచి వచ్చి పగలు బీచ్ లో తిరుగుతూ.., రాత్రిపూట పక్కనే ఉన్న ఓ కొండపై ఉండేవారని తెలసు. కానీ, ఈ ఘటనలో మరో ట్విస్ట్ నెలకొంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మచిలీపట్నానికి చెందిన ఓ యువతి, భీమవరానికి చెందిన వర్మరాజు అనే యువకుడితో గత నెల 29న విశాఖకు వచ్చింది. అయితే రాత్రైన కూతురు ఇంటికి రాకపోవడంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. కాగా, ఈ జంట రెండు రోజుల పాటు గోపాలపట్నంలోని ఓ లాడ్జిలో ఉన్నారు. ఇక ఈ నెల 2న అప్పికొండ శివాలయంలో పెళ్లి కూడా చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ జంట అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 8న ఈ జంట మరోసారి అప్పికొండ శివాలయానికి వచ్చి దర్శించుకున్నారు.

కట్ చేస్తే.. ఆ రోజు రాత్రంతా ఆ యువతి బీచ్ లోని రాళ్ల మధ్య ఇరుక్కుని నరకం చూసింది. స్థానికులు గమనించి వెంటనే ఆ యువతిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై స్పందించి ఆ యువతిని విచారించారు. అయితే ఈ కేసులో ఏం జరిగిందనే విషయంపై పోలీసులు తాజాగా మీడియాతో మాట్లాడారు. ఆదివారం రాత్రి ఫోటో దిగుతుండగా ఆ యువతి కొండపై నుంచి తానే కిందపడినట్లు ఒప్పుకుందని, దీంతో ఆమె ప్రియుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత ఆ యువతిని స్థానికులు గమినించి ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని డిశ్చార్జ్ చేసి తల్లిదండ్రులకు అప్పజెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఆమెతో పాటు వచ్చిన వర్మరాజు కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ యువకుడు దొరికితే మరిన్ని నిజాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయ పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి