iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం! స్కూల్లో చేరిన తొలి రోజే

  • Published May 25, 2024 | 10:19 AM Updated Updated May 25, 2024 | 10:19 AM

Good News To Students: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు ముగుస్తున్న తరుణంలో పాఠశాలల్లో చేరిన తొలిరోజే విద్యార్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Good News To Students: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు ముగుస్తున్న తరుణంలో పాఠశాలల్లో చేరిన తొలిరోజే విద్యార్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Published May 25, 2024 | 10:19 AMUpdated May 25, 2024 | 10:19 AM
విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం! స్కూల్లో చేరిన తొలి రోజే

ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక పాఠశాలల రూపురేఖలే మారిపోయాయి. నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూల్స్ కి తగ్గట్టు అత్యాధునికంగా తీర్చిదిద్దడం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన, మార్కులు, ర్యాంకుల విషయంలో ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడడం ఇలా చాలానే మార్చారు జగన్. తాగునీటి వసతి, టాయిలెట్స్, మంచి క్లాస్ రూములు, విద్యార్థులకు ట్యాబ్ లెట్స్ పంపిణీ ఇలా చాలా విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు. గడిచిన ఇన్నేళ్ళలో ఏ ప్రభుత్వం చేయని పని జగన్ సర్కార్ చేసి చూపించింది. ఒకప్పుడు స్కూల్ కి వెళ్లడం కంటే జైలుకెళ్లినట్టు ఫీలయ్యేవారు. జైళ్లను తలపించేలా ఆ టాయిలెట్లు దారుణంగా ఉండేవి. కొన్ని పాఠశాలల్లో అయితే తాగు నీరే ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రతీ స్కూల్లో మినరల్ వాటర్ సదుపాయం ఉంది. వాటర్ ప్లాంట్స్ ప్రత్యేకంగా ఉన్నాయి. విద్యార్థుల కోసం తరగతి గదులు మారిపోయాయి, పేద, మధ్యతరగతి వాళ్ళ జీవితాలు మారిపోయాయి.

ప్రభుత్వ బడుల్లో చదివితే ఏమవుతారో.. పిల్లల జీవితం ఏటైతాదో అని భయపడి కష్టమైనా ప్రైవేట్ పాఠశాలల్లో చదివించేవారు. ఫీజుల భారం భరించలేక మధ్యతరగతి వాళ్ళు పేదలుగా మారిపోతున్నారు. అలాంటి వారికి జగన్ సర్కార్ అమ్మ ఒడి పేరుతో చేయూతనిచ్చింది. ఏటా 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించింది. పుస్తకాలు, యూనిఫార్మ్, మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం ఇలా చాలానే చేసింది ఏపీ ప్రభుత్వం. తాజాగా ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎండాకాలం సెలవులు ముగిసే సమయం దగ్గర పడింది. మరికొన్ని రోజుల్లో పాఠశాలలను తెరవనున్నారు. ఇప్పటికే కొత్త అడ్మిషన్ల హడావుడి మొదలైంది. ఇక అడ్మిషన్ల హడావుడి అయిపోతే తర్వాత పిల్లలకు యూనిఫార్మ్, పుస్తకాల పంపిణీ హడావుడి మొదలవుతుంది.

ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. పాఠశాలలు తెరిచిన మొదటి రోజునాడే పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. గతంలో స్కూల్స్ తెరిచినా కూడా సకాలంలో పాఠ్యపుస్తకాల పంపిణీ కరిగేది కాదు. నెల, రెండు నెలలు ఆగవలసి వచ్చింది. అయితే ఎప్పుడైతే జగన్ ప్రభుత్వం ఏర్పడిందో.. అప్పుడే పాఠశాలలపై దృష్టి సారించారు. పాఠశాలలు తెరిచిన మొదటిరోజునే పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. తాజాగా ఈ ఏడాది కూడా స్కూలు తీసిన మొదటి రోజునాడే పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. వేసవి సెలవుల తర్వాత అడ్మిషన్లు తీసుకోవడం.. కొత్త క్లాస్ కి విద్యార్థులు ప్రమోట్ అవ్వడం ఇవన్నీ చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అదే సమయంలో కొత్త టెక్స్ట్ బుక్ లు ఎప్పుడు వస్తాయా అని ఆతురతగా ఎదురుచూస్తుంటారు.

చాలా రోజులు ఎదురుచూస్తేనే గానీ తెలియదు. పైగా టెక్స్ట్ బుక్ లు వచ్చేలోపు చాలా సమయం వృధా అవుతుంది. ఇలాంటి పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం వెంటనే పిల్లల పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వ పాఠశాలలు తెరిచిన మొదటి రోజు నాడే పాఠ్య పుస్తకాలను అందజేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే 2024-2025 సంవత్సరానికి సంబంధించిన మొదటి సెమిస్టర్ టెక్స్ట్ బుక్ లను మండల లెవల్ స్టాక్ పాయింట్లకు పంపించడం జరిగిందని.. పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని ఏపీ సర్కార్ తెలిపింది. ప్రైవేట్ పాఠశాలలకు కూడా టెక్స్ట్ బుక్స్ అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. కాగా ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet GirişBetcioivermectin tabletJojobet girişJojobet girişJojobetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Girişmarsbahis