iDreamPost

నాలుగోసారి నాగార్జునకే ఓటు

నాలుగోసారి నాగార్జునకే ఓటు

తెలుగు టెలివిజన్ చరిత్రలో ఓ కొత్త పోకడకు శ్రీకారం చుట్టిన రియాలిటీ షోగా బిగ్ బాస్ ఎంత సంచలనం రేపిందో అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికి బిగ్ బాస్ మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటిది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నడిపించగా రెండోది న్యాచురల్ స్టార్ నాని ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేకపోయాడు. దానికి తోడు లేనిపోని వివాదాలు సోషల్ మీడియా రూపంలో చుట్టముట్టడంతో నాని ఇంకోసారి దాని జోలికి వెళ్లకూడదని గట్టిగా డిసైడ్ అయ్యి సెలవు చీటీ ఇచ్చేశాడు.

ఇక దాన్ని సమర్ధవంతంగా నడిపించేందుకు స్టార్ మాకు నాగార్జున కంటే బెస్ట్ ఆప్షన్ కనిపించలేదు. అప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి యాంకర్ గా అద్భుతమైన స్పందన దక్కించుకున్న నాగ్ ఆశించినట్టే థర్డ్ సీజన్ ని సమర్ధవంతంగా నడిపించాడు. చిరంజీవితో సహా అందరు యాంకర్ల కంటే స్టార్ మా ఛానల్ కు నాగార్జున ఫస్ట్ ప్లేస్ సంపాదించుకున్నాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఫోర్త్ సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి రిస్క్ చేయకుండా యాంకర్ కోసం బుర్రలు బద్దలు కొట్టుకోకుండా నాగార్జుననే కొనసాగించాలని స్టార్ మా నిర్ణయించుకున్నట్టు సమాచారం.

ఇది అధికారికంగా ప్రకటించినప్పటికీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిందని సమాచారం. గతంలో విజయ్ దేవరకొండ, వెంకటేష్, అల్లు అర్జున్ అంటు ఏవేవో పేర్లు వినిపించాయి కానీ ఫైనల్ గా బాల్ కింగ్ కోర్ట్ దగ్గరికే వచ్చి ఆగిపోతోంది. ప్రస్తుతం వైల్డ్ డాగ్ షూటింగ్ లో ఉన్న నాగ్ ఆ తర్వాత బంగార్రాజు మొదలుపెడతాడు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేశాడు. మధ్యలో వచ్చే గ్యాప్ లో బిగ్ బాస్ 4 ని ప్లాన్ చేస్తారట. ఈసారి ఏఏ పార్టిసిపెంట్స్ ని తీసుకొస్తారో చూడాలి మరి. వివాదాలతోనే నడిచే బిగ్ బాస్ షోలో ఇప్పటిదాకా శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగుంజ్ విజేతలుగా నిలిచారు. కొత్త సిరీస్ మరింత రక్తి కట్టేలా టీం ఇప్పటికే పాల్గోనేవాళ్ళ లిస్టు తయారిలో బిజీగా ఉందట.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి